కాప్రా నేటిధాత్రి 20:
నిషేదిత డ్రగ్స్, గంజాయి కొన్న అమ్మిన కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ జిల్లా అభ్కారి అధికారి నవీన్ కుమార్ హెచ్చరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అభ్కారి ఉపఅధికారి ముకుంద్ రెడ్డి అదేశాల మేరకు అభ్యారి టస్క్ఫోర్ సిఐ భారత్ భూషన్ అధ్వర్యంలో ఆదివారం చర్లపల్లి రాంపల్లిలో దాడులు చేసి గంజాయి అమ్ముతున్న ఇద్దరిని పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ చెందిన హరికుషావా వద్దనాలుగు కిలోలు, ఒరిస్సాకు చెందిన బైనాధ్ బిస్వాల్ వద్ద రెండు కిలోల గంజాయి పట్టుకుని ఘటకేసర్ అబ్కారి స్టేషన్ లో అప్పగించినట్టు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి ఇద్దరి నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో టాస్క్ఫోర్స్ సిఐ భరత్ భూషణ్ ఎస్ఐ శ్రీనివాన్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.