చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నాపాక లక్ష్మీనరసింహస్వామి ఆది ఏకశిలా శిలాక్షేత్రం నందు సోమవారం రోజున అయోధ్య రాములవారి ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని నాపాక లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద స్వామివారికి అభిషేకాలు అర్చనలు అన్న ప్రసాద వితరణ జరిగినది గ్రామం నుండి ఇతర గ్రామాల నుండి 500 మందికి పైగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు హైదరాబాదు నుండి హరే రామ హరే కృష్ణ మట గురువుగారు వారి వెంట ఆగయ్య సేటు వారి సతీమణి దేవాలయాన్ని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు పెండ్యాల ప్రభాకరాచార్యులు గారు చైర్మన్ యాదండ్ల రాజయ్య గారు డైరెక్టర్లు ముద్దంగుల ఐలయ్య రామకృష్ణ పరమహంస మందిర అధ్యక్షులు కంచర్ల రమేష్ గ్రామస్తులు చిన్నాల రమేష్ నంగునూరు వెంకటేశ్వర్లు కావటి కొమురయ్య గూట్ల మొగిలి శనవేన సంపత్ విశ్వనాధుల వీరన్న తదితరులు పాల్గొన్నారు.