మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల కేంద్రంలోని 10వ వార్డ్ లో నర్సింహాచారి అనారోగ్యం తో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు చించోడ్ అభిమన్యు రెడ్డికి తెలియజేయడం జరిగింది. వారి మృతికి సంతాపం తెలిపి అంతక్రియ ఖర్చులకోసం ఆర్థిక సహాయాన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా వారి కుటుంబానికి 5000 /రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 10వ వార్డ్ ఇంచార్జ్ గడ్డం సాగర్ , జగదీష్ ,మహేంధర్ రెడ్డి, సుశీలకుమార్, తదితరులు పాల్గొన్నారు.