ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం పారుపల్లి గ్రామానికి చెందిన జెల్ల రాజేశ్వరి (25) గత కొన్ని నెలల నుండి కడుపునొప్పితో బాధపడుతుండేది. ఆర్థిక ఇబ్బందుల వలన హాస్పిటల్లో చూపించుకోలేదు.కడుపునొప్పి బాధ భరించలేక ఈనెల 3 తారీఖున సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొని చనిపోయినది అని తెలిపారు.మృతురాలు కడుపు నొప్పి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయినాదని మృతురాలి తండ్రి ఇండ్ల సారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు.