ఎస్టిపిపి ని వరించిన ప్రతిష్టాత్మక రక్షణ పురస్కారం

జైపూర్,నేటి ధాత్రి:

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సిసి ఎల్) 2X600 మెగావాట్ల జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టిపిపి) 2025 సంవత్సరానికి గాను“సేఫ్టీ ఎక్సలెన్స్-పవర్ థర్మల్ సెక్టర్” విభాగంలో 1వ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ అవార్డు-గోల్డ్ అవార్డ్ ను అందుకుంది.అలాగే ఎస్ సిసిఎల్ కొత్తగూడెం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ విభాగంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కి“బెస్ట్ సేఫ్టీ ఇన్నోవేషన్స్ టెక్నాలజీ-రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్” విభాగంలో 1వ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ అవార్డు-గోల్డ్ అవార్డ్ ను గెలుచుకుంది.ఈ పురస్కారాలను 2025 జనవరి 11న న్యూఢిల్లీ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య ఆతిథి వివేక్ శ్రీ వాస్తవ, ఐపీఎస్,ఫైర్ సర్వీస్,సివిల్ డిఫెన్స్&హోం గార్డ్స్ డైరెక్టర్ జనరల్ (గృహ మంత్రిత్వ శాఖ)చేతుల మీదుగా దరవత్ పంతులా,డిప్యూటీ జనరల్ మేనేజర్(ఈ&ఎం)ఎస్టిపిపి మరియు అవినాష్ దుబే డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఈ&ఎం)ఆఫీస్ ఆఫ్ న్యూఢిల్లీ,పులి సురేష్,ఎస్ఈ(సేఫ్టీ),ఎస్టిపిపి ఈ పురస్కారాలను స్వీకరించారు.ఈ విజయాలను ఎస్ సిసి ఎల్ సీఎండీ బలరాం మరియు డైరెక్టర్ (ఈ&ఎం),డైరెక్టర్(ఆపరేషన్స్) సత్యనారాయణరావు ప్రశంసించారు.జి ఎస్ జానకిరామ్ జీఎం సోలార్ ఎనర్జీ మరియు ఎన్ వి రాజశేఖర్ ఈడి మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ కంపెనీ సౌర విద్యుత్ బృందం చేసిన వినూత్న ఆలోచనలు,సురక్షిత పనితీరును కొనియాడారు.అలాగే ఈ అవార్డులు ఎస్సిసిఎల్ పవర్ విభాగంలో జీరో యాక్సిడెంట్స్ కి మరియు సురక్షిత ప్రణాళికలు,ఆధునిక సాంకేతికత వినియోగం,పరిసరాల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలకు గుర్తింపుగా దక్కాయని,సింగరేణి సంస్థ సురక్షిత,నూతన ఆవిష్కరణలతో శక్తి ఉత్పత్తి రంగంలో ముందంజలో కొనసాగుతుందని ఈ పురస్కారాలు చాటిచెప్పాయనీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!