గురుకులంలో నిద్రకార్యక్రమం సందర్బంగా నీటి సమస్య తీరుస్తామని హామీ…
కొత్తగూడ నేటిధాత్రి:
కొత్తగూడ మండల కేంద్రం లోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో గత బుధవారం రోజు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ &గ్రామీణభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ ధనసరి సీతక్క గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల తో మాట్లాడారు ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థుల గురుకులంలో నీటి సమస్య ఉందని మంత్రి సీతక్క దృష్టికి తీసుకువచ్చారు వెంటనే స్పందించిన మంత్రి గారు మాట్లాడుతూ అతి త్వరలో నే మీకు నీటి సమస్య తీరుస్తామని ఆ బాధ్యత కొత్తగూడ మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్ చేపిస్తారని విద్యార్థులతో మంత్రి సీతక్క అన్నారు మాట ఇచ్చిన మూడు రోజులు కాకముందే మల్లెల రణధీర్ ఆధ్వర్యంలో శనివారం రోజు బోర్ వేయించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీతక్క గారు మాట ఇచ్చారు అంటే కచ్చితంగా పని చేస్తారని అనడానికి ఇదొక నిదర్శనం అని రేవంతన్న సర్కార్ చేతల ప్రభుత్వం ఈ సందర్బంగా అన్నారు…
ఈ కార్యక్రమం లో గురుకులం ప్రిన్సిపాల్ కల్పనా మాజీ సర్పంచ్ &కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్య. వజ్జ బాలరాజు. సిరిగిరి సురేష్. ఈర్ప చందు. బోరు శీను. గురుకుల పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.