పదవీ కాలం ముగిసిన సర్పంచులకు ఘన సన్మానం

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం సర్పంచుల పదవీ కాలము తేది:-01.02.0224 రోజుతో పూర్తి అయినందున ఈరోజు తేది:-04.02.2024 ఆదివారం రోజున జైపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులకు సన్మాన కార్యక్రమం రైతు వేదిక జైపూర్ నందు నిర్వహించడం జరిగింది. ఇట్టి సన్మాన కార్యక్రమమునకు గోదారి రమాదేవి మండల అధ్యక్షులు, మం.ప్ర.ప.జైపూర్ ముఖ్య అతిధి గా హాజరై ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో సర్పంచులు గ్రామాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ కొనియాడారు. అనంతరం సర్పంచులకు శాలువా, పూల మాలలతో సన్మానించడం జరిగింది. సర్పంచులు తమ పదవీ కాలములో సహకరించిన ఎంపీడీవో, ఎం పి ఓ, పంచాయితి కార్యదర్శులకు మరియు ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచులు అందరు ఎంపీడీవో, ఎం పి ఓ, ఏఈ ఆర్ డబ్ల్యు ఎస్, ఏపీవో లను శాలువాలతో సన్మానించారు. తరువాత అందరు కలిసి భోజనము చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో గోదారి రమాదేవి,ఎంపీపీ జైపూర్ , పి.సత్యనారాయణ ఎంపిడివో జైపూర్ , జి.అనిల్ కుమార్ ఎంపీవో జైపూర్ , ఏ.విద్యాసాగర్ రావు ఏఈ ఆర్ డబ్ల్యు ఎస్ జైపూర్ , బి.బాలయ్య ఏ పీ ఓ ఈజీఎస్ జైపూర్ మరియు వివిధ గ్రామ పంచాయతీ ల పంచాయితీ కార్యదర్షులు, ఈ జి ఎస్ సిబ్బంది, ఈ పంచాయత్ కంప్యూటర్ ఆపరేటర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version