మార్కెట్ ను సందర్శించిన రైతు సంఘం

రాష్ట్రంలో రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి
మార్కెట్ లో ప్రాథమిక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి


ఏనుమాముల: నేటి ధాత్రి: వరంగల్ ఏనుమాముల మార్కెట్లోని మిర్చి యార్డును సోమవారం రోజు సందర్శించిన తెలంగాణ రైతు సంఘం నాయకులు మిర్చి కొనుగోలు విషయంపై రైతులను పంట దిగుబడులు, ధరల గురించి ఆరా తీయగా ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వలన పంట దిగుబడి తగ్గిపోయిందనీ పెట్టుబడి భారం పెరిగిపోయిందని మార్కెట్లో ఆశించిన ధర రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల నుండి రైతులు ఇక్కడికి రావడంతో ఇతర మార్కెట్లలో ధరలు స్థిరంగా లేకపోవడంతో ఇక్కడి వ్యాపారస్తులకు అవకాశం గా మారి వారు చెప్పిన ధరకే రైతులు పంటను అమ్ముకోవాల్సి వస్తుంది
ఈ పరిస్థితి కి విస్తుపోయి భూపాలపెల్లి జిల్లా,ఘనపూర్ మండలం,చిల్పుారు గ్రామానికి చెందిన మహిళా రైతు చిర్ర,రమణక్క స్పృహ కోల్పోయి పడిపోయింది.ఈమె 11 బస్తాల మిర్చి మార్కెట్ కు తెచ్చింది ఇక్కడి ధరల పరిస్థితి ఆమెను ఆవేదనకు లోనుచేయడముతో శ్వాస ఇబ్బందితో నేలమీద పడిపోయింది.
ఆమెను హుటాహుటినా ఎం జి ఎం కు చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది మిర్చికొనుగోలు వ్యవహారం, మిర్చిధర విషయాలు మార్కెట్ కార్యదర్శికి వివరించడము జరిగింది. ఈ కార్యక్రమము తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమిరెడ్డి శ్రీనివాస్, కూరపాటి వెంకటనారాయణ, కాసర్ల రాంరెడ్డి, సోమ రామమూర్తి, అంశాల రెడ్డి, పీరయ్య, ఎల్లయ్య పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version