ఇసుక లారీల రవాణా కొరకు బైపాస్ ఏర్పాటు చేయాలి.

జిల్లా కలెక్టర్ తహసిల్దార్ లకు గ్రామస్తుల వినతి.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

పెద్దంపేట పంకెన ఇసుక క్వారీల నుండి అంబడ్ పెళ్లి గ్రామ మధ్య నుండి లారీలు వెళ్లడం తో ప్రమాదాలు జరిగి మృతి చెందడం జరుగుతుందని పాత రహదారిని బైపాస్ ఏర్పాటు చేసి లారీలు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టర్ మరియు తహసిల్దార్ లకు వినతి పత్రం అందించారు.మహాదేవపూర్ ఉమ్మడి మండలం లో నూతన మండలం పలిమెల గ్రామంలో ఏర్పాటు చేసిన పెద్దంపేట, పంకెన, ఇసుక క్వారీల నుండి అధిక లారీలు అంబటి పెళ్లి గ్రామం మధ్యనుండి వెళ్లడంతో ఇప్పటికే ప్రమాదాలు జరిగి మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది అని, అలాగే అధిక లారీలు వెళ్లడంతో గ్రామంలో పిల్లలు పెద్దలు అనారోగ్యానికి గురి కావడం జరుగుతుందని, గ్రామస్తులు కలెక్టర్ మరియు తాసిల్దార్ లకు ఇచ్చిన దరఖాస్తులో పేర్కొన్నారు. అంబడ్ పెల్లి గ్రామానికి సంబంధించి పాత రహదారి ని బైపాస్ రోడ్డు గా మార్చి ఇసుక లారీలు వెళ్లే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. కలెక్టర్ తహసిల్దార్లకు వినతి పత్రం ఇచ్చిన వారిలో గ్రామస్తులు, సూర్యనారాయణ, గుజ్జుల శంకర్, దామరకుంట శ్రీనాథ్, అమృత సంతోష్ ,పినిగాని దేవేందర్, వావిలాల దేవేందర్, బింగిరి రవి, పత్తి మల్లేష్ ,తో పాటు ఇతర గ్రామస్తులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *