మాత రమ బాయ్ అంబేద్కర్ 127 వ జయంతిని ఘనంగా నిర్వహించారు

అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 7
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళ పల్లి మండలంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యువజన సంఘం మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రమ బాయ్ 127వ, జయంతిని పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ డి ,సునీత పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసినారు అలాగే మాజీ సర్పంచ్ ధర్మారావు జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం మండల ఆఫీసర్ సునీత ఈ జన్మ దిన కార్యక్రమాన్ని
ఉద్దేశించి మాట్లాడుతూ
7 ఫిబ్రవరి 1898లో జన్మించిన ఆమె అంబేద్కర్ అతని ఉన్నత విద్య మరియు అతని నిజమైన సమర్థ్యాన్ని కొనసాగించడంలో ఆమె మద్దతు కీలకమైందని ఆమె అనేక జీవిత చరిత్రలు సినిమాలు మరియు పుస్తకాలు సంబంధించినది, భారతదేశంలోని అనేక మైలురాళ్లకు ఆమె పేరు పెట్టారు అలాంటి గొప్ప వ్యక్తి ఆమె అని కొనియాడారు
ఈ జన్మ దిన కార్యక్రమంలో
మాజీ సర్పంచ్ శ్రీహరి, మాజీ సర్పంచ్ నిర్మల రవీందర్, భారత రాష్ట్ర సమితి మండల నాయకులు పడిదెల నర్సింగరావు, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు బండారి రామస్వామి, శనిగరపు రవికుమార్, వంతడుపుల సారంగపాణి, గ్రామ కార్యదర్శి నరేష్, వార్డ్ మెంబర్ వీరన్న , జనార్దన్ రావు,అంగన్వాడీ టీచర్స్, కారోబార్ అబ్బు, ఆశ వర్కర్స్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version