వరంగల్ రూరల్ జిల్లా (రాయపర్తి),నేటిధాత్రి:వరి గడ్డి తరలిస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి వాహనం దగ్ధం అయిన ఘటన మండలంలో చోటు చేసుకుంది.ప్రాథమికంగా తెలిసిన వివరాల ప్రకారం మండలంలోని ఏకే తండాకు చెందిన హలవత్ సుధాకర్ కు చెందిన టాటా ఏసీ వాహనం ను సోమవారం తెల్లవారుజామున హలవత్ వాసు అనే వ్యక్తి వరిగడ్డిని తరలించదానికి కిరాయికి తీసుకొని వెళ్ళాడు.గడ్డిని తీసుకుని పెరికెడు గ్రామం నుంచి కొత్తూరు గ్రామ శివారు చేరుకొనే క్రమంలో 11కేవి విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదవశాత్తు గడ్డితో పాటు టాటా ఏసీ వాహనం దగ్దం అయింది.విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.విద్యుత్ వైర్లు క్రిందకు ఉండడంవల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది అని రైతులు ఆరోపిస్తున్నారు.
