నర్సంపేట నేటిధాత్రి :
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసుల విస్తృత తనిఖీల్లో ఒక లక్ష 13 వేల రూపాయల నగదు పట్టుబడింది ఈ సంఘటన నర్సంపేట పట్టణ సమీపంలోని మహబూబాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగింది.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నర్సంపేట పట్టణంలో పోలీసుల విస్తృత తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై శీలం రవి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణ సమీపంలో గల జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేసే క్రమంలో ఖానాపురం నుండి వరంగల్ వెళ్తున్న కారును తనిఖీ చేయగా అనుమానాస్పదంగా 1 లక్ష 13 వేల రూపాయల నగదు లభ్యమైందన్నారు.నగదును ఎన్నికల కమిషన్ అధికారులకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు సరైన పత్రాలులేని కారణంగా సీజ్ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ అధికారులకు సరైన ద్రువపత్రాలు చూపించి సీజ్ చేసిన నగదును తీసుకోవాలని పేర్కొన్నారు.ఎన్నికల కోడ్ దృశ్యా నగదును బయటకు తీసుకుపోయేటప్పుడు అందుకు సంబంధించిన పత్రాలతో వెళ్ళాలని ప్రజలకు ఎస్సై రవి సూచించారు. ఈ తనిఖీలు నర్సంపేట ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
