హిమ్మత్ నగర్ గ్రామంలో కుల బహిష్కరణకు గురైన శాలివాహన (కుమ్మరి)కుటుంబం

గ్రామాలలో కుల పెద్దలదే ఆధిపత్యం

బాధ్యులపై చర్య చేసుకోవాలని బాధిత కుటుంబం
వీణవంక,( కరీంనగర్ జిల్లా) సెప్టెంబర్ 13:
నేటిదాత్రి: కుల బహిష్కరణ గురైన శాలివాహన ( కుమ్మరి) కుటుంబం తమ కుల పెద్దలే కారణం అంటున్న బాధిత కుటుంబం కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామంలో ఈనెల 10వ తేదీన శాలివాహన (కుమ్మరి) కులస్తులు అయిన ఇజ్జిగిరి రాజయ్య కుటుంబ సభ్యులను హిమ్మత్ నగర్ గ్రామం కొండపాక గ్రామంలో కుండలు విక్రయించవద్దని గ్రామంలో కుమ్మరి కులస్తులు పెద్ద మనుషులు తీర్మానం చేసి కుల బహిష్కరణ చేశారు. వారి కుమారుడు చెప్పిన వివరాల ప్రకారం హిమ్మత్ నగర్ గ్రామంలో పుట్టినప్పటి నుండి కులవృత్తైన కుండలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని గత రెండు సంవత్సరాల క్రితం శాలివాహన సంఘాన్ని ఏర్పాటు కూడా జరిగింది. గత రెండు సంవత్సరాల నుండి సంఘ చిట్టి పాట డబ్బులు ఇవ్వకుండ తన తండ్రి కుటుంబ సభ్యులను రమ్మన్నారని మా కుల పెద్దలైన కొందరు మీరు గ్రామంలో కుండలు అమ్మకూడదని తీర్మానం చేయడం జరిగిందని చెప్పారు. గ్రామానికి చెందిన చిలువేరు నర్సయ్యను ఇప్పటినుండి గ్రామంలో కుండలు అమ్మడం జరుగుతుందనీ ఈ తీర్మానాన్ని చేయడం జరుగుతుందని ఈ తీర్మానాన్ని ధిక్కరించినచో 5000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందనీ ఉక్కు జారి చేశారు. రాజయ్య ఇంటికి కుమ్మరి కులస్తులు ఎవరైనా ఎలాంటి శుభకార్యానికి వెళ్లిన వారికి 5000 రూపాయల జరినమా విధించడమేనని ఉక్కు జారీ చేశారు. బాధితులు కొన్ని సంవత్సరాలుగా కుండలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని కావల్సుకునే కొంతమంది మా కులస్తులు మాపై కుల బహిష్కరణ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version