రామడుగు నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ ఉపసర్పంచ్ ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పలు ఆరోపణలు చేశాడు. గ్రామ సర్పంచ్ భర్త ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మరియు వార్డ్ నెంబర్ భర్త తనను మానసికంగా వేధిస్తున్నారని తెలియపరిచాడు. ఉప సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయితీలో పలు ఆరోపణలు ఉన్నవని వార్డు మెంబర్లకు బదులు వారి భర్తలు సంతకాలు చేశారని, సర్పంచ్ సంతకం ఫోర్జరీ జరిగినదని,బిల్లులో బారి అవినీతి జరిగినది కాబట్టి రికార్డులపై సంతకాలు పెట్టను అన్నందుకు తనను ఉపసర్పంచ్ పదవి నుంచి తీసేస్తామని లేకుంటే నిన్ను చంపైన ఉప సర్పంచ్ పదవి లాకుంటామని వారు బెదిరించినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.