వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం

ముఖ్యఅతితులుగా ఎమ్మెల్సీ పోచంపల్లి,గండ్ర దంపతులు

రైతులకు కంటికి రెప్పల కాపాడుకుంటున్న కేసీఆర్-చల్లా

పరకాల నేటిధాత్రి(టౌన్)
పరకాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ లో ఎమ్మెల్సీ పోచంపల్లి, ఎమ్మెల్యేలు చల్లా,గండ్ర, జెడ్పీ ఛైర్ పర్సన్ జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రైతులను కంటికి రెప్పల కాపాడుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతు దర్భంగా చైర్మన్‌, వైస్ చైర్మన్‌ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.మార్కెట్ కు వచ్చే రైతులకు అండగా నిలవాలని కోరారు.రైతు సంక్షేమమే ధ్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు.వ్యవసాయ రంగానికే సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యం ఇచ్చారని, అందులో భాగంగానే రై తన్న సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.దేశ ప్రజలకు, రైతులకు అండగా ఉండేందుకే బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశామన్నారు. దేశ ప్రజలు కేసీఆర్‌ను కావాలనుకుంటున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు,మార్కెట్,సొసైటీ చైర్మన్లు,కమిటీ సభ్యులు,రైతుబంధు కన్వీనర్లు,సభ్యులు,బి.ఆర్.ఎస్ నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు,రైతులు తప్పకుండా హాజరుకాగలరు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version