వైఎస్ షర్మిల ఎమ్మెల్యే పెద్దికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి  

టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్వర్యంలో వైఎస్ షర్మిల దిష్టిబొమ్మ దగ్దం 

 నర్సంపేట,నేటిధాత్రి :

తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై అసత్యకర వ్యాఖ్యలు చేసిన వైయస్ షర్మిల ఎమ్మెల్యే పెద్దికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని నర్సంపేట కౌన్సిలర్ టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దార్ల రమాదేవి డిమాండ్ చేశారు.ఆదివారం వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై నర్సంపేట పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద వైయస్ షర్మిల దిష్టిబొమ్మను దగ్దం చేశారు.షర్మిల గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు.అనంతరం అర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ జై తెలంగాణ అనడం నేర్చుకున్న షర్మిల అమరవీరుల స్థూపం దాటి వెల్లిపోయిన నీవు అమరవీరులకు నివాళులు అర్పించావా అని ప్రశ్నించారు.తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది పట్ల మాట్లాడిన నీకు చరిత్ర చదివి మాట్లాడు నీ తండ్రి,నీ అన్న చరిత్ర తెలువని ప్రజలు లేరు అని, నీ అయ్య,అన్న లెక్క వేల కోట్లు దోసుకొని జైలుకు పోయిన విషయం అప్పుడే మరిచావా అని షర్మిలకు గుర్తుకు చేశారు.ఒక్కటి గుర్తుకు పెట్టుకో షర్మిల

నర్సంపేట డివిజన్ లో నువ్వు తిరుగుతున్న రోడ్లు పెద్ది వేసిన రోడ్లే.ప్రసంగం కోసం 

నీకు స్కిప్తు రాసిచ్చిన వ్యక్తికి తెలుసు ఎవడో మాకు తెలుసు ఆ కుక్క రాసిచ్చిన స్కిప్ట్ పట్టుకొని మాట్లాడినవ్,ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భూ కబ్జాలు చేశాడని మాట్లాడావు నీ వద్ద ఏమైనా ఆదాలరు ఉన్నాయా అని ప్రశ్నించారు.

తెలంగాణ బిడ్డను అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు నువ్వు తెలంగాణ కోసం ఉద్యమం చేసావా అని షర్మిలపై అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశావు నీ అన్న జగన్ ను అడుగు మహబూబాబాద్ లో జరిగిన ఘటన జురించి అని ఎమ్మెల్యే పెద్ది పోరాటం పట్ల ఈ సందర్బంగా షర్మిలకు గుర్తుకు చేశారు.ఎమ్మెల్యే పెద్ది తెలంగాణ రాష్ట్రం కోసం తన కుటుంబాన్ని దూరంగా పెట్టి కేసీఆర్ తో కలిసి తెలంగాణ సిద్ధించే వరకు పోరాటం చేసిన వ్యక్తి అని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తెనే నేడు తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అని తిరుగుతున్నావు అది మరిచిపోయావా అని టీఆర్ఎస్ పార్టీది 22 ఏండ్ల చరిత్ర అని ఇక్కడ తాటాకు చప్పుళ్లకు భయపడే వారు ఎవరూ లేరని పేర్కొన్నారు.ఇప్పటికైనా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు వెనక్కితీసుకొని భేషరతుగా ఎంఎల్ఏ క్షమాపణలు చెప్పాలని వైఎస్ షర్మిలను డిమాండ్ చేశారు.తక్షణమే పాదయాత్రను ముగించుకొని వెల్లిపో లేదంటే చెప్పుల దెబ్బలు తప్పవని షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ గుంటి రజినీ కిషన్,కౌన్సిలర్ టీఆర్ఎస్ పార్టీ మహిళా పట్టణం అధ్యక్షురాలు బాణాల ఇందిర,కౌన్సిలర్స్

రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి, దేవోజు తిరుమల సదానందం, రామసహయం శ్రీదేవి, గందే రజిత చంద్రమౌళి, నాగిశెట్టి పద్మ ప్రసాద్,గంప సునీత, రుద్ర మల్లీశ్వరి,వేల్పుగొండ వద్మ రాజు,లూనావత్ కవిత, మినుముల రాజు,శీలం రాంబాబు,,జుర్రు రాజు,,మహ్మద్ మహబూబ్ పాషా,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ,డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి,మాజీ సర్పంచ్ నల్లా మనోహర్ రెడ్డి,గ్రంధాలయ సంస్థ డైరెక్టర్స్

గంప రాజేశ్వర్ గౌడ్,పుట్టపాక కుమారస్వామి,మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్,రావుల సతీశ్, బీరం నాగిరెడ్డి,గోనె యువరాజు,మచ్చిక నర్సయ్య గౌడ్,యాదగిరి,రామారావు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version