మునుగోడు గోడు తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్…

నేటిధాత్రి చౌటుప్పల్

 

రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత స్వార్థంతో ఉప ఎన్నిక.. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని 18 వేల కోట్లకు బీజేపీకి తాకట్టు పెట్టిన రాజగోపాల్ రెడ్డి..

ఫ్లోరైడ్ రక్కసిని దూరం చేసిన కేసీఆర్.. కారుగుర్తుకే ఓటేసి గెలిపిద్దాం..

ఎమ్మెల్యే,చౌటుప్పల్ 14,19 వ వార్డ్ ఇంచార్జ్ నన్నపునేని నరేందర్..

చౌటుప్పల్ లో ఎమ్మెల్యే,చౌటుప్పల్ 14,19 వార్డుల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ ప్రచారం

ఊపందుకుంది..గడగడపను తడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాల్సిందిగా ఎమ్మెల్యే అభ్యర్థిస్తున్నారు..తమ గోడు తీర్చిన టీఆర్ఎస్ పార్టీకి,ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వానికి ప్రజలు జై కొడుతున్నారు..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ మునుగోడు ప్రజలు ఆలోచించి ఓటువేయాలని 18 వేల కోట్ల కాంట్లాక్ట్ కు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి,మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక ఇదన్నారు. ప్రజలు సరైన తీర్పునివ్వాలి..ఫ్లోరైడ్ రక్కసితో తండ్లాడిన మునుగోడు ప్రజల గోడును మిషన్ భగీరధతో తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదన్నారు..రాజగోపాల్ రెడ్డికి ఆస్థులు పెంచుకోవడం కావాలని,టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రజల మేలు అవసరమన్నారు..మీ ఆత్మగౌరవాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిన వాళ్ళకు బుద్ది చెప్పి,ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన టీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకు ఓటు వేయాలన్నారు..

ఈ కార్యక్రమంలో ఇంచార్జులు,స్థానిక నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version