మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి
నాగారం నేటి దాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
నాగారం మున్సిపల్ పరిధిలోని 5 వ వాడులో గల లోటస్ కాలనీలో హెచ్ఎండిఏ నిధుల ద్వారా చేపడుతున్న బాక్స్ డ్రైనేజ్ పనులను మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి పరిశీలించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనులలో నాణ్యత పాటించి త్వరగా పనులు పూర్తి చేయాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ జి. రాజేంద్ర కుమార్ , నాయకులు అన్నం రాజు శ్రీనివాస్, మరియు స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.