ఏ క్షణమైనా ప్రకటన రావొచ్చు?
రాష్ట్ర ప్రభుత్వం మీద పెరుగుతున్న ఒత్తిడి!
ఇంత కాలం ఉపేక్షించినా ఇక వేటు తప్పదని పార్టీ సీనియర్ల చర్చ?
పిలిచి పీటేస్తే, పార్టీని పాతర పెట్టేదాకా తెచ్చాడని టిఆర్ఎస్ నేతల ఆగ్రహం?
టిఆర్ఎస్ నే గెలవకుండా చేసి పెత్తనమెత్తున్నాడని ఉద్యమకారుల మండిపాటు?
అటు బిజేపి, ఇటు కాంగ్రెస్ లకు మాట్లాడే అవకాశం ఇంకా ఇవ్వొద్దు?
పువ్వాడపై ధ్వజమెత్తుతున్న కమ్మ సంఘాలు?
పెద్ద ఎత్తున కరపత్రాలు, బహిరంగ లేఖల విడుదల?
కులం ఇంత కాలానికి గుర్తొచ్చిందా? అని ఎద్దేవా!
ఖమ్మంలో మారనున్న సమీకరణాలు?
పువ్వాడ వైరి వర్గాలలో నెలకొన్న ఆసక్తి?
పువ్వాడ పై సిఎం కేసిఆర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి?
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఏ క్షణమైనా పదవినుంచి భర్తరఫ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలైన ప్లీనరీ సమావేశాలకు ముందే ఈ తలనొప్పి తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి కేసిఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పువ్వాడ అజయ్ మీద ముఖ్యమంత్రి కేసిఆర్ సీరియస్ గా వున్నట్లు చెప్పుకుంటున్నారు. వామపక్ష రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పువ్వాడ లో ఆదర్శ భావాలుంటాయని సిఎం భావించారు. అందుకే ఎనలేని ప్రాధాన్యతను కూడా అజయ్ కు కల్పించారు. గత ఎన్నికలలో పువ్వాడ అజయ్ సొంత పార్టీ నేతల ఓటమికి పాల్పడినట్లు అనేక ఆరోపణలున్నాయి. సీనియర్లను లెక్క చేయడం లేదన్న విమర్శలు వున్నాయి. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్ వాటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చారు. పార్టీలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరు సహజం. కాని వేధింపు రాజకీయాలు అసహజమైనవి. సరైనవి కాదు నాయకులు తన రాజకీయ పలుకుబడి ముందు ఎవరూ నిలబడకూడదనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. పువ్వాడకు అటు ప్రతిపక్ష పార్టీలతో పడక, ఇటు సొంత పార్టీ నేతలతో పొసగదన్నది అనేక సందర్భాలు రుజువు చేశాయి. హింసాపూరిత రాజకీయాలు ఎప్పటికైనా నష్టదాయకమే…ఖమ్మం ఘటన పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయకముందే పువ్వాడ ను సాగనంపితే మేలని సిఎం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
మీ నేటిధాత్రి లో ఈరోజు ఎక్స్ క్లూజివ్ గా…