గోతులతో రోడ్డు పై నరకయాతన పడుతున్న వాహనదారులు

ప్రమాదాలు జరిగిన పట్టించుకోరా

కనీసం దేవాలయ అధికారులకు గుంతలు బడ్డ రోడ్డు కానరావడం లేదా

నిధుల్లో నుండి గుంతలను మట్టితో పూడ్చాలన్న ఆలోచన లేదా

మందిరం వెడల్పులో బీట్ రోడ్డు తొలగించారు మట్టి రోడ్డు ఏర్పాటు చేస్తే పట్టింపు కరువు

ప్రమాదాలు జరిగిన పట్టనట్టు ఉంటున్న ఆలయ గ్రామ పంచాయతీ అధికారులు

స్టేషన్ ఘనపూర్ : (జనగాం) నేటి ధాత్రి

స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని లింగాల ఘనపూర్ మండల కేంద్రంలో గల జీడికల్ గ్రామంలో ఆటో స్టాండు నుండి పల్లె ప్రకృతి వనం వరకు పూర్తిగా పాడైన మట్టి రోడ్డు పై సార్లు కథనాలు వేసిన ఇప్పటివరకు ఎమ్మెల్యే గాని మండల అధికారులు గ్రామ పంచాయితీ అధికారులు ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం

లింగాల ఘనపూర్ మండల కేంద్రంలోని జీడికల్ గ్రామంలో ఉన్న మందిర అభివృద్ధి లో భాగంగా మంచిగా ఉన్న రోడ్డును ఆలయ సీసీ రోడ్ల పరిధిలోనికి తీసుకొని నూతనంగా సిసి రోడ్ల నిర్మించారు ఆ క్రమంలో మంచిగా ఉన్న బీట్ రోడ్డు పై మందిరానికి సంబంధించిన సిసి రోడ్లు ఏర్పాటు చేశారు. కానీ ప్రజలు ప్రయాణించవలసిన రోడ్లను ఆదవరించారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన రోడ్డుపై మూడు ఫీట్ల నాలుగు పీట్ల లోతుతో గోతులు ఏర్పడ్డాయి కనీసం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలోనైనా మట్టి పోసి ఆ గతుకులను గుంతలు లేకుండా చేస్తారేమో అని ప్రజలు ఎదురుచూసినప్పటికిని ఎలాంటి పని చేయకపోవడం బాధాకరం శనివారం రోజు సెంట్రింగ్ సామాగ్రి వేసుకుని పోతున్న ట్రాలీ ఆటో ఆ గుంతలలో సాగలేక పూర్తిగా ప్రమాదానికి గురైంది ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి ఊపిరి పీల్చుకున్నారు.
పలుసార్లు పత్రికలో కథనాలు వచ్చిన అధికారులు పట్టించుకోవడం లేదు ఆర్ అండ్ బి అధికారులైన ఆ గోతులను పూడ్చే ప్రయత్నం చేయడం లేదు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే కాకుండా జీడికల్ గ్రామం నుండి కళ్ళెం వరకు నరకయాతనగా మారిన రోడ్డు కురుస్తున్న వర్షాలతో భారీ గుంతలు పడి దర్శనమిస్తున్నాయి ద్విచక్ర వాహనదారులకు ఆటో డ్రైవర్లకు ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారాయి అత్యవసర చికిత్స కొరకు జనగాం వెళ్లాలంటే నరకాతన పడుతున్న ప్రయాణికులు గర్భిణీ స్త్రీలు, విద్యార్థులు, పట్టించుకోకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. తప్ప గుంతలను పూడ్చే ప్రయత్నం మాత్రం ఆదమరిచారని చెప్పాలి ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని చెరువులను తలపిస్తున్న గుంతలను పూడ్చాలని గ్రామ సర్పంచ్ పైన అవగాహన లేదా ఆదమరిచ్చాడు కండ్ల ముందు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ గుంతలలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు వాహనదారులు చేతన పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు గ్రామ సర్పంచి ఉండడం బాధాకరం ఇప్పటికైనా గ్రామపంచాయతీ నిధుల్లోనుండైన మట్టిని తెచ్చి పూర్తిస్థాయిలో గుంతలను పూడ్చితే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ముందు వచ్చేది వరి ధాన్యం చేతికొచ్చే సమయం ట్రాక్టర్లలో లారీలలో వడ్ల బస్తాలను తరలిస్తారు కాబట్టి చిన్న చిన్న వాహనదారులకే వరి ధాన్యముతో వస్తున్న భారీ వాహనాల పరిస్థితి ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దేవాలయ చైర్మన్ దేవాలయ నిధులనుండైనా మట్టి తెప్పించి ఆ గుంతలను, పూడ్చితే బాగుండేమో అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక సర్పంచ్ దేవాలయ కమిటీ తో మాట్లాడి చర్యలు తీసుకుని భారీ గొంతులను పూడ్చి సహకరించాలని ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version