పాలకుల విధానాలతో ఆగమ్యగోచరంగా మారిన రైతుల పరిస్థితి

తేదీల వారీగా ఏ ఓ కార్యాలయాల్లో వినతులు

ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి :

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకుల విధానాల్లో భాగంగా పెరిగిన పంటల ఉత్పత్తి ఖర్చులతో అధిక వర్షాలతో రైతాంగం పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని దీంతో ఏదో ఒక చోట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అఖిలభారత కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ‌ ఈనెల 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంటల సందర్శనలు జరిపి రైతాంగ సమస్యలపై స్థానిక వ్యవసాయ శాఖ ఏవోలకు 28 29 తేదీల్లో, జేడీలకు ఉన్నతాధికారులకు 31వ తేదీన వినతి పత్రాలు ఇచ్చి ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు.

  ఈరోజు అఖిలభారత కిసాన్ ఫెడరేషన్ (ఏఐకెఎఫ్) రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య అధ్యక్షతన పట్టణంలోని ఓంకార్ భవన్ లో నిర్వహించారు.

  ఈసందర్బంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని బహిరంగంగా ప్రధానమంత్రి హామీ ఇచ్చి ఆచరణలో దొడ్డిదారిన అమలుకు కోరుకుంటున్నారని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పీఎం ప్రణామ్ పేరిట ఎరువుల సబ్సిడీని ఎత్తివేసేందుకు విధానాల రూపొందించారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మార్కెట్ దోపిడిని విస్తృతపరిచేందుకు కార్పొరేట్ శక్తులకు మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈసమావేశంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వల్లేపు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంగతి సాంబయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి, రాష్ట్ర కోశాధికారి గుండెబోయిన చంద్రయ్య, రాష్ట్ర నాయకులు సుధీర్, మానయ్య, సింగతి మల్లికార్జున్, నాగేల్లి కొమురయ్య, వరికెల కిషన్, అంజయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version