`అమాయకులు భూములు ఆగమౌతున్నాయి?
`అన్యాక్రాంతమౌతున్నాయి?
`ఒకరి భూములు మరొకరి వశమౌతున్నాయి?
`పక్కాగా పట్టాలౌతున్నాయిఎలా?
`రికార్డుల్లో ఇంటి నంబర్ లేకుండానే రిజిస్ట్రేషన్
` ములుగులో అంతుచిక్కని అక్రమ రిజిస్ట్రేషన్లు
` గ్రామ పంచాయితీ అధికారులకు తెలియకుండా నకిలీ రికార్డుల సృష్టి
` నకిలీ ఇంటి నంబర్లకు తోడు లేని ఇళ్లను సృష్టిస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయం
` అసెస్మెంట్లు నకిలీవా , నిజమైనవా కూడా నిర్ధారించుకోలేని అధికారులు
` అక్రమాలకు అడ్డాగా ములుగు రిజిస్ట్రేషన్ కార్యాలయం
`కనిలీ రిజిస్ట్రేషన్ల కోరకు చేతులు మారుతున్న లక్షల రూపాయలు
`ఘనపురం మండలం గాంధీనగర్లో అక్రమ రిజిస్ట్రేషన్
హైదరాబాద్,నేటిధాత్రి:
ఫలాన భూమి నాదని ఎవరు ఎక్కడనుంచి కాగితాలు సృష్టిస్తారో…. చూపిస్తారో కూడా తెలియకుండా పోతోంది. రిజిస్రేషన్లు చేయిస్తున్నారు. మా భూములు అంటూ వస్తున్నారు. అసలైన భూ హక్కుదారులను ఆగం చేస్తున్నారు. వారి జీవితాల్లో చిచ్చు రేపుతున్నారు. వారి భూములు కాజేస్తున్నారు. అవి అసైన్డ్ భూములైనా సరే పక్కాగా పట్టాలు తెచ్చుకుంటున్నారు. లెక్క ప్రకారం అసైన్డ్ పట్టాలు చేయొదు? కావొద్దు? కాని దర్జాగా రిజిస్ట్రేషన్ కార్యాలయం అడ్డాగానే ఇవన్నీ సాగుతున్నాయి. ప్రైవేటు భూముల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడైతే ప్రజలకు న్యాయం జరగాలో అక్కడే అన్యాయం రాజ్యమేలుతుంది. ప్రజలను అన్యాయాలకు గురిచేస్తోంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు అనేకం పుట్టుకొస్తున్నాయి? అని జనం చెప్పుకుంటున్నారు. బాధితులు బావురుమంటున్నారు. వాళ్ల గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక విలవిలాడుతున్నారు.
కన్నీరు మున్నీరౌతున్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఆధారం లేకపోయినా, భూములను నమ్ముకొని బతకడమే ఎవరికైనా తెలుసు. అది కూడా లేకుండా చేస్తే వారి జీవితాలు వీధినపడతాయి? చాలా మంది ఇప్పటికే నేటిధ్రాత్రిని ఆశ్రయిస్తున్నారు. వివరాలు వెల్లడిస్తున్నారు. విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రైవేటు భూములా? ప్రభుత్వ భూములా? జాంతానై? రిజిస్రేషన్ కావాలా? అన్నదే ముఖ్యం. లొసుగులున్నా, లేకున్నా పత్రాలు సృష్టించొచ్చు. అలా జరుగుతున్నవి అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అయినా రిజిస్రేషన్ చేసేవారికి భయం లేదు? ఆ శాఖలో పర్యవేక్షణ లేదు? పాలకులకు పట్టింపు లేదు? అధికారపక్షానిక తీరిక లేదు? బిజేపికి అవగాహన లేదు? ప్రజాసంఘాలకు సమాచారం లేదు? ఇన్ని రాజకీయ పార్టీలున్నాయి. అన్యాయం జరుగుతున్న వారి పట్ల మాట్లాడే వారు లేరు? నిత్యం అనేక వార్తలు వస్తున్నాయి. స్పందించే తత్వం లేదు. సమయం లేదు. అవినీతి, అక్రమాలు అణిచివేస్తామని మాత్రం ప్రకటనలకు కొదవ లేదు. దాంతో రిజిస్రేషన్ కార్యాలయంలో ఆడిరది ఆట, పాడిరదిపాట,అక్రమరిజిస్ట్రేషన్లకు అడ్డాగా మారింది? ఈ మాటలు అనేక మంది బాధితులు దుమ్మెత్తిపోస్తూ చెబుతున్న మాట.
కాసులు సమర్పించుకుంటే చాలు? ఆ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కానిదేదీ లేదు? అక్రమ రిజిస్రేషన్లకు కొదువ లేదు? తూకం వేసి తూగితే చాలు…ఎవరి భూమైనా సరే…క్షణాల్లో మీ పేరుమీదకు రావాల్సిందే? కాస్తో, కూస్తో పరపతి వుంటే చాలు? నాలుగు రూకలు ఇచ్చుకనే స్థోమత వుంటే చాలు? అనుకున్న స్ధలం, కన్నేసిన స్థలం మూడోకంటికి తెలియకుండా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ స్ధలం మీదైపోతుంది? ఈ మాటలు ములుగు, భూపాల పల్లి జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. ఇన్ని విమర్శలు నిత్యం వస్తున్నా, జరిగేవి జరుతూనే వున్నాయి. సామాన్యులు అన్యాయమైపోతూనే వున్నారు. మరి ఇలా అక్రమ రిజిస్రేష్టన్లు జరిగిపోతూనే వుంటాయా? వాటికి అడ్డుకట్ట పడదా? వాటిని ఆపేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు రాదా? రిజిస్ట్రేషన్ల శాఖ ఎలాగూ పట్టించుకోవడంలేదు. రాజకీయ పార్టీలైనా పట్టించుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఇప్పటికైనా రంగంలోకి దిగాలి.
పేద ప్రజల ఉసురుపోసుకుంటూ ఎవరో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతుంటే బద్నాం అవుతున్నది అధికారపార్టీయే. తాజాగా జయశంకర్ భూపాల పల్లి జిల్లాకు చెందిన ఘణపురం మండలం, గాంధీ నగర్కు చెందిన అప్పాల కొమురయ్యకు రిజిస్ట్రేషన్ కార్యాలయం సాక్షిగా అన్యాయం జరిగింది. అక్రమం జరిగింది? ఆయన భూమి రాత్రికి రాత్రే ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ తంతు పూర్తయింది? అదెలా సాధ్యం? అని అమాయకంగా ప్రశ్నించకండి. ఇలాంటివి ఈ మధ్య కాలంలో చాలా జరుతున్నాయి. అప్పాల కొమురయ్య అనే వ్యక్తికి చెందిన 1.21 గుంటల భూమిని, అప్పాల శంకరమ్మ కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగినట్లు కొమురయ్య చెబుతున్నాడు. శంకరమ్మ తన ముగ్గురు కూతుళ్లుదేన వేణ ఉమా మహేశ్వరి, పుర్రె లావణ్య, కోమల, అప్పాల రాజు పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగిపోయింది.
ఈ స్ధలం 204 సర్వే నెంబర్లో 1.21 గుంటలు. ఈ స్ధలం అసలైన పట్టదారు అప్పాల కొమురయ్య తల్లిగారైన అప్పాల లక్ష్మమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ వుంది. అప్పాల లక్ష్మమ్మ, అతని కొడుకు కొమురయ్యలే ఈ స్ధలాన్ని కొన్ని దశాబ్ధాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. సేద్యం చేస్తూ వస్తున్నారు. అనుకోకుండా ఇటీవల ఈస్ధలం ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందని తెలిసి ఆందోళన చెందిన కొమురయ్య సబ్ రిజిస్ట్రార్ను సంప్రదించడం జరిగింది. నాకు సమర్పించిన సర్టిఫికెట్లను ఆధారం చేసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది? అదేదైనా వుంటే కోర్టుతో తేల్చుకో…పో? అంటూ సబ్ రిజిస్ట్రార్ బాధితుడు కొమురయ్యకు తేల్చిచెప్పడం జరిగింది. ఒకరి భూమి, మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ చెప్పాల్సిన సమాధానం ఇదేనా? బాధితుడు కొమురయ్య నేటిధాత్రిని ఆశ్రయించాడని తెలిసిన తర్వాత మేడమ్ మాట్లాడడానికి రమ్మంటోందని కుమర్ అనే వ్యక్తి పోన్ చేసినట్లు కొమురయ్య నేటిధాత్రికి వెల్లడిరచడం జరిగింది. అంటే తప్పు జరిగిందన్న సంగతి సబ్ రిజిస్ట్రార్ తెలుసు. అమాయకుడిని భయపెడితే బెదిరి పోతాడని సబ్ రిజిస్ట్రార్ భావించినట్లుంది. కాకపోతే కథ అడ్డం తిరిగేలా వుందన్న సంగతి అర్ధమైంది. రాజీ ప్రయత్నాలు మొదలు పెట్టి, అనుచురుల చేత కొముర్యకు పిలుపులు వస్తున్నాయి? అసలు తప్పులు చేయడం ఎందుకు? అమాయకుల ఉసురుపోసుకోవడం ఎందుకు? సరే కొమురయ్య కాస్త గండె గట్టిది కావడం వల్ల ఏం జరగలేదు. కాని అదే సెన్సిటివ్ వ్యక్తి అయితే పరిస్దితి ఎలా వుండేది? కొన్నేళ్లుగా దానిపైనే ఆశలు పెట్టుకొని, సాగు చేసుకుంటూ, భూమిని కాపాడుకుంటూ వస్తున్నాడు. అలాంటి భూమి, ఒక్కసారిగా తనది కాకుండా పోయిందన్న సంగతి తెలిసి గుండె ఆగితే ఎవరు భాధ్యత వహించేవారు? సహజంగా రిజిస్రేషన్ కార్యాలయం అంటేనే రకరకాల లిటిగేషన్లు అనుకునే వారు. తప్పుడు డాక్యుమెంట్లకు తావుండదనేవారు? కాని కాలం మరిపోయింది.
సర్వదరిద్రాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయం నెలవైందని ప్రజలు తిట్టుకుంటున్నారు. వెలుగులోకి వస్తున్న విషయలు కూడా అవే రుజువు చేస్తున్నాయి. అసలు కొమురయ్య స్ధలంలో లేని ఇంటి నెంబర్ను సృష్టించి పెట్టిన తప్పుడు సర్టిఫికెట్ను పొందుపర్చడం జరిగినట్లు తెలుస్తోంది. దానిని ఆధారం చేసుకొని రిజిస్ట్రేషన్ చేసినట్లు స్పష్టమౌతోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. కాని గ్రామ పంచాయితీ ఇచ్చిన రసీదులు ఎక్కడా లేవు. అందుకు సంబందించిన వివరాలు ఏవీ లేవు! దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నట్లు డబ్బుల కోసం ఐనవారి మధ్యనే చిచ్చుపెట్టి దందాలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఇలా జీవితాలతో ఆడుకుంటున్నాయి. మరి అప్పాల శంకరయ్యకు న్యాయం ఎవరు చేయాలి? ఆయనకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చాలి. రెండు జిల్లాలో ఏక కాలంలో రెండుచోట్ల విధులు నిర్వహిస్తూ, రిజిస్రేషన్లు సాగిస్తూ, అమాయకుల జీవితాలను వీది పాలు చేస్తున్నారన్న ఆరోపణలకు కారణమౌతున్న వారికి కొమురయ్య ఉదంతం సాక్ష్యం కాదా? ఇప్పుడు చెప్పండి? గతంలో కూడా అనేక రుజువులు బైటకొచ్చాయి. అక్రమాలు వెలుగుచూశాయి? ఇప్పుడు కొమురయ్యకు ఎవరు న్యాయం చేస్తారో చేయండి? అతను పడుతున్న మనోవేధన ఎవరు తీర్చగలరు? లెక్కలేసుకొని, లెక్కబెట్టుకొని లెక్కలేని తనంగా తప్పుల లెక్కలు ఒకదాని తర్వాత మరొకటి లెక్కలేనన్ని చేసుకుంటూ పోతున్నవారు ఎవరు? అందరికీ తెలుసు…అయినా అందరి నోళ్లు ఎందుకు మూగబోతున్నాయి? సమాజమా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో? సాక్ష్యాధారాలతో సహా అన్ని రుజువులు కళ్లముందు కనిపించినా సరే…కాలం సమాధానం చెప్పేదాకా ఆగాల్సిందేనా? అమాయకులు మా బతుకింతే అనుకుంటూ కాలం వెల్లదీయాల్నా?