దళిత మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

భారతీయ జనతా పార్టీ జమ్మికుంట దళిత మోర్చా అధ్యక్షుడు శనిగరపు రవి ఆధ్వర్యంలో దళితుల పై బిఆర్ఎస్, ఎంఐఎం గుండాల దాడులకు నిరసనగా గురువారం జమ్మికుంట గాంధీ చౌక్ లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ హాజరై మాట్లాడుతూ… హైదరాబాద్ లోని మలక్ పెట్ లో సోలంకి విజయ్ శ్రీమతిని ఎంఐఎం పార్టీకి చెందిన గుండాలు వేధిస్తే పోలీసులు కేస్ కూడా పెట్టని కారణంగా మనస్తాపానికి గురై విజయ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని బుధవారం మృతి చెందడం జరిగిందన్నారు. ఈ సంఘటన పై వెంటనే ప్రభుత్వం స్పందించాలని, బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల వివక్ష చూపుతున్న బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో శనిగరపు రవి, ఇల్లందుల శ్రీనివాస్, ఠాకూర్ రాకేష్, ఎనగణమండ్ల రామస్వామి, కల్లెపెల్లి రమేష్ ,చిలువేరు రమేష్, ఎండి అప్రోజ్, మారపల్లి అన్నపూర్ణ, చానగొండ రాజు, ఎండి షబ్బీర్, పూదరి వెంకన్న గౌడ్ లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version