తెలంగాణ ప్రగతి…వేనోళ్ల పొగిడె జగతి.

` ఎనిమిదేళ్లలో ఎన్నో అద్భుతాలు.

` అటు సంక్షేమం…ఇటు అభివృద్ధి మంత్రం.

`కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు కలగన్నామా!

` తెలంగాణలో ప్రాజెక్టులు ఊహించామా!

`భవిష్యత్తులో చెరువుల్లో అన్ని కాలాల్లో నీళ్లుంటాయనుకున్నామా!

` రైతుబంధు అమలు ఊహలకే అందనిది…

`24 గంటల ఉచిత విద్యుత్‌ సాగుకు అందడం వరం కాదా!

` తెలంగాణ తెచ్చుకున్నది నాయకుల రాజకీయం కోసం కాదు…

` తెలంగాణ తలరాత మార్చేందుకు…

`అద్భుత ప్రగతి ఆవిష్కరించుకునేందుకు…

`అది కేసిఆర్‌ తోనే సాధ్యం… కళ్లముందు కనిపిస్తయన్నదే సాక్ష్యం

తెలంగాణ ప్రగతి…వేనోళ్ల పొగిడె జగతి.

    హైదారాబాద్‌,నేటిధాత్రి:  

ఒక వ్యక్తి బలమైన సంకల్పం వుంటే ఎంతటి అసాధ్యమైన పనైనా పూర్తి చేయొచ్చు. గమ్యం ముద్దాడొచ్చు. లక్ష్యం సాధించవచ్చు. అందులోనూ వ్యక్తి గత లక్ష్యం వేరు. వ్యవస్థ లక్ష్యం వేరు. ఒక వ్యవస్థకు పట్టిన పీడను వదిలించడం అంటే మాటలు కాదు. ఆ వ్యవస్థకు స్వేచ్ఛను ప్రసాదింపజేయడం అంటే అదొక యజ్ఞం. ఆత్మగౌరవం, స్వయం పాలన అందించే పోరాటానికి మించిన లక్ష్యం మరొకటి వుండకపోవచ్చు. అలాంటి లక్ష్యాసాధకులు చరిత్రలో అతి కొద్ది మంది మాత్రమే వున్నారు. పురాణాలు, రాజరిక వ్యవస్థలో సామ్రాజ్యాలను యుద్ధాలు చేసి గెల్చుకున్న రాజులున్నారు. కానీ ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్రాలు అందించిన వారిలో మొదటి వరుసలో మహాత్మాగాంధీ గురించి చెప్పకుంటే, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పేరు చెప్పకతప్పనిది. నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ లేనిది తెలంగాణ లేదు. కేసిఆర్‌ ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. పట్టుదలకు కూడా ఊపిరిపోయగల మనోబలిష్టుడు కేసిఆర్‌. ఆ పట్టుదలకే బలమొచ్చేంత పట్టుబట్టి మరీ తెలంగాణ కోసం కొట్లాడాడు. అసలు ఆయన జై తెలంగాణ అనకపోతే ఇప్పుడు తెలంగాణ ఎలా వుండేదో ఆలోచించాలంటేనే భయం వేస్తుంది. తెలంగాణ సమాజం అనుభవించిన కష్టాలు, నష్టాలు అన్నీ ఇన్ని కాదు. అవి ఒక రోజో, ఒక నెలో, ఒక ఏడాదో కాదు…కొన్ని దశాబ్దాలు. విద్యా వసతులు లేవు. వైద్య సదుపాయాలు లేవు. సాగుకు కరంటు రాదు. వచ్చింది సరిపోదు. అయినా కరంటు బిల్లు మోపెడు. హార్స్‌ పవర్‌ కు ఇంత అని వసూలు చేశారు. చెరువుల్లో నీళ్లుండవు. ప్రాజెక్టులు లేవు. రిజర్వాయర్లు కట్టలేదు. వర్షాధార పంటలు తప్ప దిక్కులేదు. ఒక వేళ రైతు ధైర్యం చేసి వరి వేసినా అక్టోబర్‌, నవంబరు నెలల్లో వచ్చే అకాల వర్షాలతో పంట మునిగి పోవడం. మురిగిపోవడం. , ఏప్రిల్‌, మే నెలల్లో పంట చేతికొచ్చే సమయంలో వడగళ్ళు కురవడం. అలా వరి రాలిపోయి గడ్డి మిగిలడంతో ఆ రైతు పడిన వేదన, రోధన చెప్పనలవి కాదు. ఇక కరువు కాటకాలు ఎదురైతే భూ గర్భ జలాలు ఇంకితే పంట నష్టాలు. పంట చేతికొచ్చే సమయంలో కరంటు కోతలు. దాంతో ఎండిన పంటలు. దు:ఖంతో పొలం తగలబెట్టుకున్న రైతులున్నారు. వర్షాధార పంటలు పత్తి, నువ్వులు వేసి, చేలకు పురుగు పట్టి పంట చేతికి రాక అదే పురుగుమందులు తాగిన రైతులు ఎంతో మంది వున్నారు. ఈ కష్టాలు, నష్టాలు, రైతుల బలన్మరణాలు ఆనాడు ఆంధ్ర లో లేవు. తెలంగాణ కు ఎండబెట్టి ఆంద్రకు కరంటు ఇచ్చే వాళ్లు. కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టుకునేవాళ్లు. ఎప్పటికప్పుడు కాలువలు స్థిరీకరించుకునే వాళ్లు. తుఫానులకు పంటలు నష్టపోతే పరిహారాలు అందించేవారు. మరి తెలంగాణ ను మొండి చేయి చూపేవారు. అప్పుడప్పుడు తెలంగాణ మీద మొసలి కన్నీళ్లు కార్చేవారు. మరి ఇప్పుడు తెలంగాణ ఒక విజయం. తెలంగాణ ఒక గర్వకారణం. తెలంగాణ ప్రగతి శీల రాష్ట్రం. తెలంగాణ ఒక ఆదర్శపాలనకు సాక్ష్యం. సంక్షేమానికి నిదర్శనం. ఇదంతా కేవలం ముఖ్యమంత్రి సంకల్ప బలం. ఆయన సాధించి, తెలంగాణ ప్రజలకు అందించిన అద్భుతమైన విజయం. తరతరాల తెలంగాణ భవిష్యత్తుకు శ్రీకారం. ఇదీ కేసిఆర్‌ యుగం…యుగ కర్తగా ఆయన కీర్తి అజరామరం.

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనమిది సంవత్సరాలు.

 ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో అద్భుతాలు. అసలు కలలో కూడా ఊహించలేని అద్భుత విజయాలు. అలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. అటు సంక్షేమం…ఇటు అభివృద్ధి మంత్రం. రెండూ కలిపి తన పరిపాలనలో తెలంగాణ రూపు రేఖలు మార్చిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ రాకముందు వున్న కష్టాలలో కరంటు కొతర ఎంతో దుర్భరం. సకలం కరంటుతో ముడిపడిన వ్యవస్థలే…ఏ చిన్న జిరాక్స్‌ మిషన్‌ పని చేయాలన్నా కరంటు కావాలి. ఇక వ్యవసాయానికి ఎంతో మూలం. మరి ఆ కరంటు కళ్ల చూద్దామంటే కూడా కనిపించని రోజులు తెలంగాణ అనుభవించింది. ఒక దశలో తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారన్న కక్ష్యతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు కరంటు కష్టాలు చూపించారు. తెలంగాణ వస్తే ఇది కూడా రాదని భయపెట్టించారు. కానీ తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే కరంటు కష్టాలు తీరినవి. మండు వేసవిలో కూడా ఇరవై నాలుగు గంటల కరంటు చూసి తెలంగాణ మురిసింది. సంబురపడిరది. అబ్బురపడిరది. తెలంగాణ తెచ్చుకున్నందుకు చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. అది కూడా తీర్చిన కేసిఆర్‌ ను తెలంగాణ గుండెల్లో పెట్టుకుంది. మారాజువని పొగిడిరది. కేసిఆర్‌ నాయకత్వానికి ఎదురులేకుండా, తిరుగు లేకుంటా, సంక్షేమ పాలనకు ఎవరూ అడ్డు పడకుండా, కిరికిరి పెట్టకుండా ప్రతిపక్షాలను తెలంగాణ సమాజం దూరం పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీలను తెలంగాణ సమాజం వెలివేసింది. అదీ కేసిఆర్‌ నాయకత్వం. పాలనలో స్వర్ణ యుగం. 

కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు కలగన్నామా!

 తెలంగాణ రాకపోతే కళ్యాణ లక్ష్మి అనే పథకం ఒకటి అమలు చేయొచ్చని అనుకున్నారు. అరవై ఏళ్ల ఉమ్మడి పాలనలోనే కాదు, కేంద్రం గాని, ఏ ఇతర రాష్ట్రాలలో అమలు కాలేదు. ఉద్యమ సమయంలో కేసిఆర్‌ పల్లె నిద్ర అనే కార్యక్రమంలో వుండగా ఓ తండాలో తెల్లవారితే పెళ్ళి అనగా వదువు ఇళ్లు కాలిపోయింది. ఆమె పెళ్ళి కోసం తెచ్చిన వస్తువులతో పాటు, డబ్బులు కూడా బూడిదయ్యాయి. ఏం చేయాలో తెలియని అయోమయంలో వున్న ఆ కుటుంబాన్ని కేసిఆర్‌ అప్పటికప్పుడు డబ్బులు అందజేశాడు. దగ్గరుండి పెళ్ళి జరిపించాడు. అప్పుడే నిర్ణయించుకున్నాడు. తెలంగాణ వస్తే పేదింటి ఆడపిల్ల పెళ్ళి తల్లిదండ్రులకు భారం కాకుండా వుండాలి. ప్రభుత్వం వారి పెళ్ళికి ఆర్థిక సహాయం అందించాలి. ఆడపిల్ల తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బతకాలి. పైగా ఆడపిల్లు బతకాలి. పురిట్లోనే చిదిమేయొద్దు. అందుకు ప్రభుత్వ భరోసా అవసరం అని గుర్తించి, కేసిఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకం ప్రకటించారు. ఇప్పటి వరకు పదిలక్షలకు పైగా కళ్యాణ లక్ష్మి పథకం అందుకున్న కుటుంబాలు తెలంగాణలో వున్నాయి. 

 తెలంగాణలో ప్రాజెక్టులు ఊహించామా! 

తెలంగాణలో చెరువులు పూడిక తీస్తే చాలు. వర్షాకాలంలో చెరువులు నిండితే చాలు. కనీసం ఒక్క పంటవరకైనా చెరువులో నీళ్లుంటే చాలు అనుకున్నాం. కానీ తెలంగాణ లో వున్న 46 వేలకుపైగా చెరువుల పునరుద్ధరణ జరుగుతుందనుకున్నామా? ఓ వైపు పూడిక తీసి, కట్టలు మరమ్మత్తులు చేసుకొని, వాటిపై ఈత చెట్లు పెంచి, చెరువుల్లో మళ్ళీ మత్స్య వైభవం చూస్తామనుకున్నామా? అటు సాగుకు నీరు. ఇటు గౌడ వృత్తికి తోడ్పాటు. ముదిరాజ్‌ లకు చేపల సంపద. ఇలా పల్లె మళ్ళీ మొగ్గలేస్తుందని, సంతోషాలతో చిందులేస్తుందని, పరవళ్లతో పరవశించిపోతుందని ఎవరైనా అనుకున్నారు. ఇదొక అద్భుత ప్రగతైతే, తెలంగాణ ప్రాజెక్టులు అనే పదానికే చోటు లేదన్న కాడ, కాళేశ్వరం నిర్మాణం చేసి తెలంగాణ సస్యశ్యామలం చేసిన అపర భగీరధుడు కేసిఆర్‌. తెలంగాణ దేశానికి అన్నం పెట్టే దిశగా ఇంత తక్కువ సమయంలో పయనిస్తుందని అనుకున్నామా! ఎటు చూసినా పల్లె పచ్చదనం పురివిప్పి నాట్యం చేస్తున్నంత అందంగా సుందరశోభాయమానమై కళకళలాడుతోంది. నేను తెలంగాణ అని ఎలుగెత్తి చాటుతోంది. కేసిఆర్‌ ను గుర్తు చేస్తోంది… కేసిఆర్‌ లేకుంటే నాకు ఈ శోభ ఎక్కడిది అంటోంది. 

రైతుబంధు అమలు ఊహలకే అందనిది…

 24 గంటల ఉచిత విద్యుత్‌ సాగుకు అందడం వరం కాదా! దేశంలో ఎక్కడైనా ఇంత తక్కువ సమయంలో అభివృద్ధి కనిపించిందా? ఉమ్మడి రాష్ట్రంలో వుంటే సాధ్యమౌనా? ఇతర పార్టీలు అధికారంలో వుంటే ముందట పడునా? రాజకీయాల కోసం తప్ప, ప్రతిపక్షాలు ప్రగతి కోసం కాదు. ప్రజలు నమ్మితే ఏం చేస్తామనేదాని మీద వారికి క్లారిటీ లేదు. ఇప్పటికీ సీమాంధ్ర నేతల కళ్లు తెలంగాణ మీదే వున్నాయి. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాయి….ఆదమరిచి ప్రతిపక్షాలను కనికరిస్తే ఇక అంతే సంగతి. మన పరిస్థితి మళ్ళీ మొదటికి… తెలంగాణ తెచ్చుకున్నది నాయకుల రాజకీయం కోసం కాదు…తెలంగాణ తలరాత మార్చేందుకు…అద్భుత ప్రగతి ఆవిష్కరించుకున్నదంటే కేసిఆర్‌ దక్షతకు నిదర్శనం. కళ్లముందు కనిపిస్తున్నవే సాక్ష్యం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version