డీసీపీ వెంకటేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్

నేటిధాత్రి హసన్ పర్తి:
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రెహమాన్, ఇతర రాష్ట్ర నాయకులపై అకారణంగా దాడి చేసిన డీసీపీ ఎం వెంకటేశ్వర్లను వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో హన్మకొండ భీమారంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి కసరబోయిన రవితేజ మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ఇటీవల కాలంలో విద్యార్థి సంఘాలు, మీడియా విద్యాలయాల్లోకి రావద్దంటూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరియు విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ సెక్రటేరియట్ ముట్టడి తలపెట్టి… ముందుకు సాగుతున్న సందర్భంలో విద్యార్థి నాయకులు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు రెహమాన్ మరియు రాష్ట్ర నాయకులపై బూతు మాటలతో, పిడుగుద్దలతో గుద్దుతూ సెక్రటేరియట్ వద్దకు మీరు రావద్దు అంటూ మీడియా ఉందన్న విచక్షణ కూడా లేకుండా ఆగ్రహంతో ఊగిపోతూ చట్టాన్ని చేతిలోకి తీసుకొని, మానవ హక్కులను తుంగలో తొక్కి, ఫ్రెండ్లీ పోలీసులను గాలికి వదిలేసి అకారణంగా అన్యాయంగా విద్యార్థి నాయకులను పై దాడి చేయడం సిగ్గుచేటని ఈ దాడికి పాల్పడిన డీసీపీ వెంకటేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ ని సంప్రదిస్తామని,
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు ఊట్కూరు ప్రణీత్ గౌడ్ వేల్పుల చరణ్ జిల్లా నాయకులు రమేష్ అనిల్ సునీల్ రవి రాజు మోహన్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version