*”జగనన్న” బడుగు “వికాసం”*

*”నేటిధాత్రి” ఎన్టీఆర్ జిల్లా, గన్నవరం*

“జగనన్న బడుగు వికాసం పథకం ద్వారా ఎస్.సి., ఎస్. టి., బిసి లబ్దిదారులు ఆర్ధికంగా యెదిగి పది మందికి ఉపాధి కల్పించాలని సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రటరీ శ్రీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని మహీంద్రా 

షో రూంలో “జగనన్న బడుగు వికాసం” లబ్దిదారులకు టిప్పర్ల పంపిణీ సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమానికి శ్రీ తిలక్ అధ్యక్షత వహించారు. టిప్పర్ల కు సంబంధించిన కనీస పరిజ్ఞానం లబ్దిదార్లు కలగివుండాలని ఆయన సూచించారు. సక్రమంగా ప్రతినెలా బ్యాంకు రుణం చెల్లించేందుకు వీలుగా ఆదాయం పొందే అవకాశాలను ముందుగానే గుర్తించే వ్యాపార లక్షణాలను అలవరచుకోవాలన్నారు. వ్యాపార రంగం అంటేనే నిరంతరం పోటీ వుండే రంగం అని ఏమాత్రం యేమరపాటు పనికిరాదని అన్నారు. రూ. 58 లక్షల విలువైన టిప్పర్ పై రాష్ట్రం 45 శాతం మేర సబ్సిడీ యివ్వడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి పేదల పక్షాన నిలిచారన్నారు. లబ్దిదార్లకు బ్యాంకు రుణాన్ని సత్వరమే అందించిన “సెంట్రల్ బ్యాంక్” అధికార్లను తిలక్ అభినందించారు. ఈ పథకంలో లబ్దిదార్లను, బ్యాంకులను సమన్వయ పరచడంలో సహకరించిన దళిత పారిశ్రామిక వేత్త కడియం వెంకట రావును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 

 

సెంట్రల్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ మూర్తి లబ్ధిదారులకు టిప్పర్ వాహనాల తాళాలు అందజేశారు. సెంట్రల్ బ్యాంక్ ఛీప్ మేనేజర్ రవీంద్ర, కొవ్వూరు సెంట్రల్ బ్యాంకు మేనేజర్ వనిత, మహీంద్రా కంపెనీ చైర్మన్ , సీఎండి కిషన్, రాజరత్నం, బాలకృష్ణ,భార్గవ్, లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దళిత పారిశ్రామిక వేత్త కడియం వెంకట రావు ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version