చింతలతోనే అసలు చింత?

 

` తను సాగడు…ఇంకొకర్ని సాగనివ్వడు?
` తన సొంత మనుషులు తప్ప మరెవరినీ కలవడు?
` ` పార్టీని పట్టించుకోడు..కార్యకర్తలతో సమావేశమవ్వడు?
` నాయకులకు సమయమే ఇవ్వడు?
` దేశమంతా పుంజుకుంటున్న, ఇక్కడ పట్టించుకోడు?
` బిసి నేతలంటే పడదు..ఎస్సీ నాయకులను సంప్రదించడు?
` ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడడు..ఉద్యమాలకు పిలుపునివ్వడు?
` రాష్ట్రంలో ప్రభల శక్తిగా పార్టీ ఎదుగుతున్నా, ఇక్కడి సంగతి పట్టించుకోడు?
` నియోకవర్గంలో సగటు కార్యకర్తల ఆందోళన..ఆవేదన..!

హైదరాబాద్‌ , నేటిధాత్రి :
పట్టి పట్టి లింగం కడితే భక్తుడౌతాడా? పట్టింపు లేనప్పుడు పట్టం కడితే పట్టించుకుంటారా? ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. సాక్షాత్తు ఖైరాతాబాద్‌ నియోజకవర్గానికి చెందిన బిజేపి నాయకులు, కార్యకర్తలు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజేపి పాగా వేయాలని, అధికారంలోకి రావాలని యోచిస్తోంది. అందుకు

తగ్గట్టుగా రాష్ట్ర నాయకత్వం ఎంతో కృషి చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో జోష్‌ నిండుతోంది. దుబ్బాక ఎన్నికలో విజయం తర్వాత వరుస విజయాలు బిజేపి చవిచూస్తోంది. ఆ తర్వాత వచ్చిన జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజేపి ఎంతో ప్రభావం చూపింది. అధికార తెరాసకు దిమ్మతిరిగే షాక్‌నిచ్చింది. మళ్లీ వంద సీట్లు మావే అన్న తెరాసకు నిలువరించింది. సీట్ల కోతకు కారణమైంది. బిజేపి జెండా రెపరెపలాడిరది. నాయకుల్లో ఆత్మస్ధైర్యాన్ని నింపింది. కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నిండిరది. కాని ఖైతరాబాద్‌ నియోకవర్గంలో మాత్రం పరిస్ధితి భిన్నంగా ఉంది. నియోజవర్గ ఇన్‌చార్చి చింతల రాంచంద్రారెడ్డి పార్టీని పట్టించుకునే పరి

స్ధితే లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే చింతలకు పార్టీ మీద చింతే లేదంటున్నారు స్థానిక కార్యకర్తలు. ఆయన పార్టీని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారంటున్నారు. నియోజక వర్గంలో ఆయన తిరగక నెలలు గడుస్తోందంటున్నారు. క్షేత్ర స్ధాయిలో సమీక్షలు లేవు. నాయకులకు బాధ్యతలు అప్పగించింది లేదు. మొత్తంగా నియోజకవర్గాన్ని ఆయన పట్టించుకుటున్నది లేదంటున్నారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగనిర్వరు.. పార్టీలో జోష్‌ నిండనివ్వరు అని చాలా మంది బిజేపి నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు.


సహజంగా గెలిచినప్పుడు నాయకులు ప్రతి క్షణం నియోజకవర్గంలోనే తిరుగుతుంటారు. ఉప్పల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ చేసిన దాంట్లో కనీసం పదోవంతు కూడా చింతల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిచేయలేదంటున్నారు. ఎమ్మెల్యేగా ఉంటూనే నాడు ప్రభాకర్‌

సుమారు రూ.1500 కోట్లతో ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ లాంటి ప్రాజెక్టును కూడా తెచ్చిన సంగతిని నాయకులు గుర్తుచేసుకుంటున్నారు. అంతే కాదు తన నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లి రైల్లే స్టేషన్‌ అభివృద్ధికోసం కూడా పెద్దఎత్తున నిధులు తెచ్చారని చెప్పుకుంటున్నారు. ఇక ఉప్పల్‌లో ఓ సామాన్య నాయకుడిగా ఇప్పటికీ నిత్యం ప్రభాకర్‌ ప్రజల్లో వుంటారని చెప్పుకుంటున్నారు. అలా మన నియోజవర్గంలో ప్రజల మధ్య ఉండే నాయకుడుంటే ఎంతో బాగుండన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఓ వైపు దుబ్బాక, మరో వైపు హుజూరాబాద్‌లలో గెలవడమే కాకుండా, రాష్ట్ర్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా బిజేపి రాష్ట్ర కార్యవర్గం పని చేస్తోంది. కాని ఇక్కడ మాత్రం అధికార టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా చింతల పనిచేస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌ లాంటి డివిజన్లలో నాయకులు చేస్తున్న ఉద్యమాలకు చింతల ఏనాడు మద్దతిచ్చింది లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
దేశమంతా బిజేపి ప్రభంజనం. ఇటీవల జరిగిన ఐదురాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల్లో బిజేపి నాలుగింటిని కైవసం చేసుకొని మంచి ఊపు మీదుంది. తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు హజరైన ప్రధాని నరేంద్రమోడీకి స్వాగతం పలుకుతూ బిజేపి ఎంపిలు నినాదాలు చేయడాన్ని దేశమంతా

చూసింది. బిజేపి శ్రేణుల్లో సంతోషం నింపింది. రాష్ట్ర బిజేపి కార్యాలయలంలో సంబరాలు సాగాయి. హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాలలోనూ ఇన్‌ఛార్జిలు ఎంతో సంతోషంగా సంబరాలు నిర్వహించారు. కాని ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఇన్‌ఛార్జి కనిపించింది లేదు. నాయకులు, కార్యకర్తలుచేసిన సంబరాలలో

ఆయన పాల్గొన్నది లేదని నాయకులు అంటున్నారు. విజయాలు నాయకులకు స్పూర్తినిస్తాయి. కార్యకర్తలో జోష్‌ నింపుతాయి. మరి అలాంటి వేడుకలు ముందుండి నిర్వహించాల్సిన చింతల జాడే లేదని చెబుతున్నారు. కనీసం నాయకులతో సంప్రదించి సంబరాలు చేయమని కూడా చెప్పింది లేదని అంటున్నారు. రాష్ట్రంలో మళ్లీ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుందన్న చర్చ జోరుగా జరుగుతోంది. బిజేపి రాష్ట్ర నాయకత్వం ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటోంది. గతంలో ఎమ్మెల్యేగా అనుభవం వున్న నేతగా, ఇన్‌చార్జిగా కొనసాగుతున్న చింతలకు మాత్రం ఆ సోయి లేనట్లుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిర్ణీత సమయానికి ఎన్నికలు వచ్చే అవకాశం వున్నా, ఇప్పటి నుంచైనా పార్టీ పటిష్టతకు కృషి చేయాలి. నియోజకవర్గాన్ని పట్టించుకోవాలి. సహజంగా ఏ నాయకుడైనా ఓడిపోతే , మరింత కసిగా పనిచేయాలి. ప్రజల్లో వుండాలి. ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఉండాలి. ఉద్యమాలు చేయాలి.

పోరాటాలు సాగించాలి. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో అవన్నీ నిషేదమన్నట్లు తలిపిస్తోందంటున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతలకు కనీసం పార్టీ బలపడాలన్న ఆరాటం కూడా లేకపోయిందని నాయకులు అంటున్నారు. నియోజకవర్గ పరిధిలో బిసి నాయకుల ఎదుగుదలను చింతల సహించలేపోతున్నారన్న అపవాదు కూడా వినిపిస్తోంది. అందుకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి. నియోజవర్గ పరిధిలోని డివిజన్ల నాయకులతో ఆయన ఈ మధ్య కలిసింది, వారితో మాట్లాడిరది లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారన్నది చర్చించింది లేదు. నాయకులతో సమావేశమయ్యింది లేదు. ఎన్నికలనప్పడే హడావుడి. అంతే తప్ప మరేమీ లేదంటున్నారు. ఇప్పటికైనా పార్టీ నాయకత్వం ఖైరతాబాద్‌ నియోజకవర్గం వైపు దృష్టిసారించాల్సిన అవసరం ఉందంటున్నారు. పార్టీని కాపాడుకుంటూ వస్తున్న వారిని గుర్తించాలి. వారితో పార్టీ సమావేశం కావాలి. కొత్త నాయకత్వాన్ని నియోజకవర్గానికి అందించాలి. పార్టీ కోసం అహర్నిషలు పనిచేస్తున్నవారు ఉన్నారు. ఇంత కాలం ఒకే సామాజిక వర్గం గుప్పిట్లో ఈ నియోజకవ్గం ఉంది. ఇకనైనా బలహీనవర్గాలకు అవకాశం కల్పించాల్సిన అవసరం కూడ ఆవుందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇలాగే కొనసాగితే, చింతల పట్టించుకోకపోతే, పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించకపోతే ఎంతో బలంగా వున్న పార్టీకి ఖైరతాబాద్‌లో ఇబ్బందులే అంటున్నారు. నడిపించే నాయకుడే కరువౌతాడంటున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version