నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలో ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు బండారి సురేష్ ఆధ్వర్యంలో 184వ వార్షిక ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డివిజన్ గౌరవ అధ్యక్షులు తక్కల్లపెల్లి సోమేశ్వర్ కమిటీ సభ్యులతో కలిసి ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాకస్ మండె డాక్యురె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చాయాచిత్ర పథక ఆవిష్కరణ చేసిన అనంతరం కేకు కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు.ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు బండారి సురేష్ మాట్లాడుతూ ఛాయాచిత్రం మరపురాని దృశ్యాలను చూపిస్తుందని తెలిపారు.
ఫోటోగ్రఫీ వృత్తిపై ఆధారపడే కుటుంబాలు అనేకమంది తమ వృత్తిలో క్రమశిక్షణతో ఉండాలన్నారు.సామాజిక మార్పులలో అనేక టెక్నాలజీలతో వెనుకబడుతున్న ఫోటోగ్రఫీ కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.ఈకార్యక్రమంలో దొంతి సంతోష్ కుమార్ గౌడ్, గట్ల అమరేందర్, బేతి విశ్వబంధు(భాస్కర్ ), గిరగాని దుర్గేష్ గౌడ్,బేతి కన్నయ్య, కుసుమ శంకర్, ఎస్ కే జావిద్, మెదరమెట్ల వెంకన్న, తాటికొండశివ, నర్సింగరాములు, నరేందర్, సతీష్, మచ్చిక రాజ్ కుమార్ గౌడ్, రాజేందర్ నర్సంపేట డివిజన్ ఫోటో, వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు.