గృహలక్ష్మి పథకానికి గడువు పొడిగించాలి.

నిక్ష్పాతకం లేకుండా అర్హులందరికీ గృహలక్ష్మి వర్తింపచేయాలి.

భాజాపా సీనియర్ నాయకుడు తడక అశోక్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బృహత్తర కార్యక్రమం గృహ లక్ష్మీ పథకానికి గడువు పెంచాలని బిజెపి సీనియర్ నాయకుడు తడక అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో తాసిల్దార్ రాజేష్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెడితే బాగుండేది కానీ అనవసరమైన ఆంక్షలు పెడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలను విస్మరిస్తున్నారని అందుకు నిదర్శనమే గృహ లక్ష్మీ పథకం అని మూడు రోజుల వ్యవధిలోనే లబ్ధిదారులందరూ దరఖాస్తు చేసుకోవాలని నిర్దిష్ట సమయానికి కేటాయించడం సరికాదని దాని వలన ప్రజలందరూ ఇబ్బందికి గురవుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించిమండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ లక్ష్మీ పథకాన్ని వర్తింప చేస్తూ నెల రోజులపాటు దరఖాస్తు ప్రక్రియను పొడిగించాలని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో దరఖాస్తు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version