గృహలక్ష్మి పథకం దరఖాస్తు గడువు పెంచాలి

మహా ముత్తారం నేటి ధాత్రి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
పలిమేల మండల కేంద్రంలో బీఎస్పీ పలిమెల మండల అధ్యక్షుడు కలుగూరి వెంకట్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో గారికి గృహలక్ష్మి పథ కంలో ఉన్న సమస్యల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో వెంకట్ మాట్లాడుతూ గృహలక్ష్మి పథకానికి కావలసిన పట్టా భూములు స్థానికంగా ఉన్న గిరిజనులకు మరియు ఎస్.సి బీసీలకు ఎవరికి కూడా లేనందున అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయకపోవడం వల్ల స్థానికంగా ఉన్న యువతకు ఈ గృహలక్ష్మి అప్లికేషన్ చేసుకోవడానికి ఇబ్బందులు ఉండడం వల్ల. అదేవిధంగా కులం ఆదాయం నివాసం సర్టిఫికెట్లు తీసుకోవడానికి అవకాశం లేనందున వీటన్నింటినీ ప్రభుత్వం పరిశీలించి భూమిలేని మరియు రేషన్ కార్డులు లేని వారిని కూడా వారికి వున్న ఆధార్ కార్డు నే అన్నింటికి అర్హతగా భావించి అందరిని అర్హులుగా తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కోరడం జరుగుతుంది. లేనియెడల బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమాలు చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో
బిఎస్పీ పలిమేల మండల కోశాధికారి జాడి భాస్కర్
మరియు బిఎస్పీ కార్యకర్తలు రణధీర్ శివాజి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version