గీత పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశo.

తంగళ్ళపల్లి. నేటి ధాత్రి..

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కోడూరు సత్యనారాయణ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పొట్టి తాటి మొక్కలు నాటించాలని చెట్లపై ప్రమాదాలు నివారించాలని బీహార్ రాష్ట్రంలో నలంద ప్రాంతంలో తక్కువ సమయంలో ఎత్తులో పెరుగుతున్న తాటి చెట్లను పెంచుతున్నారని అక్కడ తాటి గింజలను పండ్లను మన మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ మంత్రి కేటీ రామారావు వేలాది రూపాయలు వెచ్చించి బీహార్ రాష్ట్రం నుంచి 50 వేల గింజలను ఇక్కడికి తెప్పించారని వీటిని గీతా పారిశ్రామిక సంఘాలకు పంపిణీ చేస్తున్నన్ని మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ తెలియజేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న గీత పారిశ్రామిక సగర సంఘాలు టిఎఫ్టి సంఘాలకు తాటి గింజలు పంపిణీ చేస్తున్నారని ఈత సంఘాల నాయకులు తాటి గింజలను నాటించి తక్కువ కాలంలో ఎక్కువ ఎత్తులో పెరిగే తాటి మొక్కలను నాటించి వృత్తిలో అదేవిధంగా ప్రమాదాలు నివారించుకోవాలని కళ్ళు గీతా వృత్తిని రక్షించుకోవాలని ప్రభుత్వ సహకారంతో ఆధునికరించుకోవడo ప్రణాళికను రచించుకోవాలని గీత కార్యక్రమం సందర్భంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి కందుకూరి రామ గౌడ్ గీతా పారిశ్రామిక సంఘం నాయకులు సుద్దాల కొండయ్య భక్తిని నారాయణ రాజయ్య గౌడ్ పరుశురాం లింగయ్య సుద్దాల ధర్మేందర్ గీతా సంఘం నాయకులు గౌడ సంఘం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!