గణనాథుడికి చలిమెడ పూజలు

కోనరావుపేట, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో స్నేహ మిత్ర యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడి వద్ద వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనరసింహారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శించుకోగా యువకులు స్వామివారి కండువాతో సన్మానించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదలను అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, ముష్ణం జీవన్ గౌడ్,ఈర్ల పర్శరాములు తాళ్లపల్లి మధు, తిరుపతి, మెరుగు లక్ష్మణ్, దుర్గ మహేష్, స్నేహ మిత్ర యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *