ఓరుగల్లులో వీరయ్య విజయ విహారం

జన సంద్రంగా మారిన Arts and Science College Grounds

కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర మంత్రి దయాకర్ రావు,మెగాస్టార్ చిరంజీవి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్,హీరో రాంచరణ్, ఎమ్మెల్యేలు రమేష్, నరేందర్,శంకర్ నాయక్,మేయర్ సుధారాణిలతో కలిసి అతిథిగా హాజరయ్యారు*

ఓరుగల్లులో వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ “వీరయ్య వీర విహారం” పేరుతో ఘనంగా జరిగింది.నగరంలో పేరొందిన Arts and Science College Grounds లో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పోటెత్తారు,మైదానం జనసంద్రంగా మారింది.ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మెగాస్టార్ చిరంజీవి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, హీరో రాంచరణ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్,శంకర్ నాయక్, వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి తదితర ప్రముఖులతో కలిసి అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులలో ఉత్సాహం ఉరుకలెత్తింది,చప్పట్లు,ఈలలు, కేరింతలతో మైదానం హోరెత్తింది.దీంతో,చిరంజీవి,ఆయన కుమారుడు రాంచరణ్ లు ఆనందభాష్పాలు రాల్చారు, వారి హృదయాలు పులకించిపోయాయి.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర చిరంజీవికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు.కార్యక్రమంలో మెగాస్టార్ మాట్లాడుతూ, ఓరుగల్లు ప్రాంత వాసులు తన పట్ల గతంలో చూపిన, ఇప్పుడు చూపుతున్న స్వచ్ఛమైన ప్రేమాభిమానాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు.వాల్తేరు వీరయ్య సినిమా అద్భుత విజయం సాధించడానికి సహకరించిన అభిమానులు,ప్రేక్షకులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version