ఆపత్కాలంలో అండగా సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

ముఖ్యమంత్రి సహాయ నిధిపేదలకు వరమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. 

శుక్రవారం హన్మకొండలోని వారి నివాసంలో పరకాల,నడికూడ,ఆత్మకూరు,దామెర మండలాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరు చేసిన చెక్కులను ఎమ్మెల్యే అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గ్రామాలలో అనారోగ్యంతో భాదపడుతూ చికిత్స చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒకవరంలా మారిందని అన్నారు.

 

సీఎంఆర్ఎఫ్ ఆపత్కాలంలో ఎంతోమంది నిరుపదలకు ఆసరగా నిలుస్తుందన్నారు.

పేద ప్రజలను ప్రభుత్వం ఎల్లప్పడు అండగా ఉంటుందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.

 

 దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 

 

 వివరాలు:

ఆత్మకూరు మండలం – రూ.212000/-

దామెర మండలం – రూ.110500/-

పరకాల పట్టణం – రూ.41000/-

పరకాల మండలం – రూ.138400/-

నడికూడ – రూ.200000/-

 

కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version