ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కెసిఆర్ గారి లక్ష్యం

పట్టణ ప్రగతి ద్వారా సుందరంగా నగరాలు 

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి లక్ష్యమని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ గారు అన్నారు. 4 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 46 వ డివిజన్లో 4 కోట్ల 50 లక్షల నిధులతో

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ… దేశంలోని ప్రధాన పట్టణాలకు ధీటుగా తెలంగాణ రాస్ట్రం లోని పట్టణాలను తీర్చి దిద్దాలనే సంకల్పంతో ముఖ్య మంత్రి కె సి ఆర్ ఈ కార్యక్రమానికి రూపకల్పన అన్నారు. అభివృద్ది కార్యక్రమాలలో ప్రజలను భాగస్వాములను చేయడమే కార్యక్రమ ముఖ్యోద్దేశ్యమని

అన్నారు. అభివృద్ది , పరిశుభ్రత , పచ్చదనం ధ్యేయంగా అధికారులు , ప్రజాప్రతినిధులకు విస్తృత అధికారాలిస్తూ కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. చెత్త ఎక్కడికక్కడే పడేయడం వలన వ్యాదుల బారిన పడే అవకాశం వున్నందున తడి చెత్త , పొడి చెత్త గా వేరు చేసి ఇవ్వాలని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి డివిజన్లోని ప్రజలకు మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్ నగర కమీషనర్ సుమన్ రావు డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పోరేటర్ పాతపెల్లి లక్ష్మీ ఎల్లయ్య బాల రాజ్ కుమార్ నాయకులు తానిపర్తి గోపాలరావు జే.వి.రాజు నారాయణదాసు మారుతి , మెహిద్ సన్నీ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version