ఆదమరిస్తే అంతే….

 వాహనదారులకు తప్పని తిప్పలు
పట్టించుకోని అధికారులు ప్రజా ప్రతినిధులు
నెక్కొండ, నేటిధాత్రి: నిత్యం ఎంతో రద్దీగా కనిపించే రోడ్లు ప్రధాన రహదారులు ఇప్పుడు గుంతల మయం తో ఏ రోడ్డు పైన ఏ రంద్రం ఉందో ఊహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి వాటికి తోడుగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న ఆర్ అండ్ బి అధికారుల పనితీరు తోడుకావడంతో వాహనదారులు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే నిత్యం ఎంతో జనంతో రద్దీగా ఉండే ప్రధాన మార్గమైన నర్సంపేట నెక్కొండ రహదారి నుండి వరంగల్ కు వెళ్ళు మార్గం అయినటువంటి దీక్షకుంట, సీతారాంపురం , హరిచంద్ర తండా ,ముదిగొండ వెళ్లే రోడ్డు మార్గం అకాల వర్షాల కారణంగా పూర్తిగా శిథిలావస్థకు గురైంది. నర్సంపేట ప్రధాన రహదారి నుండి దీక్షకుంట కు వెళ్ళు మార్గంలో నీ మంగలి తండా వద్ద ఆర్ అండ్ బి రోడ్డుకు రంద్రాలు పడడంతో నిత్యం నెక్కొండ కు వెళ్లే ప్రజలు వాహనదారులు విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందికి గురి అవుతున్నారు. కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా ఆర్ అండ్ బి అధికారులు తమ రోడ్డు వైపు కూడా చూడలేదని కేవలం అధికారులు ప్రభుత్వ జీతానికి తప్ప ప్రజా సమస్యలు పట్టించుకునే వారు కాదు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక నాలుగు గ్రామపంచాయతీలకు చెందిన రైతులకు విద్యార్థులకు వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని అయ్యా గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం నెక్కొండ నర్సంపేట కు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇకనైనా ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని స్థానికులు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version