వేములవాడ :నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల్ కోడి ముంజ గ్రామంలో ఆర్ అండ్ ఆర్ కాలనీలో అవినీతికి
చర్యల తిసుకోవాలని భూమల్ల లక్ష్మణ్, ప్రజవాణి ద్వారా కలెక్టర్ కు పిర్యాదు చేసినారు
కొడుముండు గ్రామంలో గు0జర్సయ్య S/O రాజయ్య కి ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్యాకేజీ, పట్టా 222 గల దానిని జారి చేసినారు. అతను ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు.దీనికి గాను గ్రామపంచాయతీ 1-97 గల ఇంటి నెంబర్ జారి చేసినది ,అనంతరం 603 రూపాయల ఇంటి పన్ను కూడ చెల్లించారు. మరియు సెస్ విద్యుత్ శాఖ ద్వారా 116నెంబర్ గల కరెంట్ మీటర్ తీసుకున్నాడు. గుంజ నర్సయ్య తన ఆర్థిక ఇబ్బందుల వలన అ యొక్క ఇంటిని గ్రామ సర్పంచికి తన ఇంటిని, పట్టా(భూమి) అమ్ముకున్నాడు.దానిని సర్పంచ్ కొనుగోలు చేసుకుని 1-97 గల ఇంటిని కూల్చివేసి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేసుకుని (222 (గెటిట్ నెంబర్ ), ఇంటి నెంబర్ 1-97 ను సిరిసిల్ల నుండి కరీంనగర్ వెళ్లే రహదారికి అనుకుని ఉన్నా) విలువ 72 ప్లాట్ గల ప్రభుత్వ భూమిలోకి మార్చుకొన్నాడు దీనికై గ్రామ కార్యదర్శి మరియు ఎంపీడీఓ శ్రీధర్ సహకరిచినారు. అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసినాడు.నేను గతంలోనే తేది 10.10. 2022 రోజున ఇట్టి విషయం పై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినాను. నా ఫిర్యాదును వేములవాడ ఎంపీడీఓ శ్రీధర్ కి విచారణ నిమిత్తం డీపీఓ పంపినారు కానీ ఎంపీడీఓ మొఖాపై ఎలాంటి విచారణ చేయకుం డా నాకు నోటీసు జారి చేశారు. మా కార్యలయానికి విచారణకు రావాలని కానీ నేను గతంలోనే పూర్తి ఆధారాలతో ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకోకుండా, అతనే స్వంత నిర్ణయాలతో నన్ను ఇబ్బందుకు గురి చేస్తున్నాడు. గ్రామ కార్యదర్శికి సహకరిస్తూ వారు చేసిన తప్పులను కప్పి – పుచ్చడానికి ఎంపీడీఓ ప్రయత్నం చేస్తున్నాడు. కావున మా యందు దను తలచి. ఆక్రమంగా గు0జనర్సయ్య పేరున ఉన్నా ఇంటి నెంబరు 1-97 ను ఇంటి పన్ను రిసిప్ట్ నెంబర్ 1680 గల దానిని ఎలాంటి ఆధారం లేకుండా గుంజ కనకలక్ష్మి పేరున మార్చిన విషయాన్ని మరియు సెస్ అధికారులు ఇచ్చిన మీటర్ నెంబర్ 116 పై కరెంట్ బిల్ చెల్లించిన ప్రతిని మరియు 2020 లో గుంజ నర్సయ్య కి ఆసీస్ మెంట్ లో గ్రామ కార్యదర్శి, ఎంపీడీఓ శ్రీధర్ 1-97 గల ఇంటి నెంబర్ కేటాయించి ఇంటి పన్ను వసూలు చేసిన విషయాన్ని, ఇంటిపన్ను 603 చెల్లించిన ఇంటిని కూల్చి వేసిన విషయాన్ని విచారించకుండా, నున్న విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్న, మరియు అక్రమాలకు పాల్పడిన , కార్యదర్శిని అతనికి సహకరించిన ఎంపీడీఓ శ్రీధర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకొని ప్రత్యేకాధికారి చే విచారణ జరిపించి నన్ను వేదిస్తున్న పంచాయతీ కార్యదర్శి పై, మరియు ఎంపీడీఓ పై శాఖపరమైన చర్యలు తీసుకొని గెజిట్ నెంబర్ 222 నుండి విలువగల ప్లాట్ నెంబర్ 72 లోకి మారిన పట్టాను రద్దు చేసి ప్రభుత్వ భూమిని కాపాడి కాపాడాలని, 3302 222 CAS 25065
గతంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులపై ఇప్పటికైనా తక్షణమే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అని
భూమల్ల లక్ష్మన్ కోరుతున్నాడు.