తహశీల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టులు.
భూపాలపల్లి నేటిధాత్రి
అర్హులైన జర్నలిస్టులందరికీ
ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ రేగొండ మండల వర్కింగ్ జర్నలిస్టులు తహశీల్దార్ సత్యనారాయణ స్వామికి శనివారం వినతిపత్రం అందజేశారు.అక్రిడేషన్. నాన్ అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు.దీని పట్ల తహశీల్దార్ సానుకూలంగా స్పందించారు. మండలంలోని పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులు పల్నాటి రాజు,రమేష్,భిక్షపతి,ఆనంద్,కమలాకర్,మధు,రాకేష్,రాజు,రణధీర్,బోయిని రాజు,మార్త రాజు,మేకల రాజు తదితరులు పాల్గొన్నారు.