అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
కేసముద్రం (మహబూబాబాద్) నేటిధాత్రి:మహబూబాబాద్ జిల్లా సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా దూసుకపోతుందని ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మితమవుతున్న మెడికల్ కళాశాల & నర్సింగ్ కళాశాల, కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ సముదాయాన్ని మరియు మున్సిపాలిటీ భవనాన్నిమహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నిర్మాణ విధానాన్ని అధికారులతో కలిసి వివరంగా తెలుసుకుంటూ వారికి ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.భవన నిర్మాణం ఎంత ముక్యమో అదే విధంగా ఇన్ఫ్రాస్త్రక్టర్ ,పరిసరాలు, పార్కింగ్,పచ్చదనం లాంటి అన్ని హంగులతో నిర్మాణం చేపట్టాలని అధికారులకు కొన్ని సూచనలు చేసారు.మహబూబాబాద్ లాంటి వెనుకబడ్డ జిల్లాను అభివృద్ధి చేయడమే సీఎం లక్ష్యం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా. పాల్వాయి రాంమోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరిద్, మార్నేని వెంకన్న, చిట్యాల జనార్ధన్, యాళ్ల మురళీధర్ రెడ్డి, గోగుల రాజు, హరిసింగ్, ఎలెందర్ మరియు తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version