సెలవు రోజుల్లో కాంటాలు

కేసముద్రం(మహబూబాబాద్), నేటిదాత్రి:

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు సెలవు ప్రకటించగా శనివారం ట్రేడర్లు మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల తూకాలు చేసి లావాదేవీలను జరపడం శోచనీయం.మార్కెట్ పని దినాలలో కాకుండా మార్కెట్ సెలవు దినాల్లో లావాదేవులు జరపడంతో మార్కెట్కు రావలసిన ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.అలాగే మార్కెట్ నియమాలకు విరుద్ధంగా ట్రేడర్లు వ్యవసాయ ఉత్పత్తులను ఖరీదు చేయడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు.మార్కెట్ పాలకమండలి ఎన్ని నియమ నిబంధనలు పెట్టిన కూడా ట్రేడర్లు నడుచుకోకవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. ఇటీవల సేమ్ డే సేమ్ చెక్ సమస్య మరిచిపోక ముందే ఇలాంటి ఘటనలు జరగడం మార్కెట్ పేరు ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశాలు ఉంటుందని పలువురు బహిరంగనే విమర్శిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version