సింగరేణి ఆల్టైం రికార్డుగా బొగ్గు ఉత్పత్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

కొత్తగూడెం టౌన్ :డిసెంబర్ ఒక్క నెలలోనే 67.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి గత ఏడాది డిసెంబర్ నెల ఉత్పత్తిపై 19 శాతం వృద్ధి రోజుకు సగటున 2.18 లక్షల టన్నుల బొగ్గు రవాణాతో మరో ఆల్టైం రికార్డు ఇదే ఒరవడితో వార్షికాంతానికి 34 వేల కోట్ల టర్నోవర్, అత్యధిక లాభాల దిశగా సింగరేణి సింగరేణి చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించనున్నాం ఇకపై రోజుకు కనీసం 2 లక్షల 30 వేల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలి అన్ని ఏరియాల జీఎంల సమీక్ష సమావేశంలో సింగరేణి సి అండ్ ఎండి. ఎన్. శ్రీధర్ సింగరేణి భవన్, హైదరాబాద్, తేది : 2023.01.3.

 

సింగరేణి సంస్థ 2022 డిసెంబర్ నెలలో తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ ఉత్పత్తిగా 67.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించిందనీ, ఇది గత ఏడాది డిసెంబర్ నెలలో సాధించిన దానికన్నా 19 శాతం అధికమని, అలాగే సగటున రోజుకు 2 లక్షల 18 వేల టన్నుల బొగ్గు రవాణా జరిపి మరో ఆల్టైం రికార్డును నెలకొల్పిందని, ఇదే ఒరవడితో మిగిలిన 3 నెలల కాలంలో ఉత్పత్తి, రవాణా సాధించాలని ఛైర్మన్ అండ్ ఎండి.ఎన్. శ్రీధర్ కార్మిక శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో బుధవారం నాడు ఆయన సింగరేణి డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జీఎంలతో డిసెంబర్ నెల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 

గత 2021 డిసెంబర్లో 56.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా, ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్లో 19 శాతం వృద్ధితో 67.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామన్నారు. అలాగే గత డిసెంబర్లో 37.37 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్లో 24.47 శాతం వృద్ధితో 47 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించామని తెలిపారు. 

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలి ఉన్న 80 రోజులు చాలా కీలకమని, రోజుకు కనీసం 2 లక్షల 30 వేల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలని, తద్వారా సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలో చరిత్రలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా నమోదు చేయనున్నామని, తద్వారా అత్యధికంగా 34 వేల కోట్లకు పైబడి టర్నోవర్, అత్యధిక లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మణుగురు, కొత్తగూడెం, రామగుండం రీజియన్, అడ్రియాల ప్రాజెక్టుల నుండి గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి రవాణా జరగడం పైన తన సంతోషం వ్యక్తం చేశారు. అన్ని ఏరియాలు ఇదే ఒరవడితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సమావేశాన్ని ప్రారంభిస్తూ ఆయన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది మరింత వినూత్నంగా, చారిత్రకంగా నిలిచిపోయే ప్రగతిని, వృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ నెలలో సాధించిన ప్రగతిపై ఆయన హర్షం ప్రకటిస్తూ కార్మికులు, అధికారులకు తన అభినందనలు తెలిపారు. 

ఈ సమావేశంలో ఇంకా డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ పా.ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్.ఎన్. బలరాం, డైరెక్టర్ ఇ అండ్ ఎం డి. సత్యనారాయణ రావు, ఈడీ కోల్ మూమెంట్ జె. ఆల్విన్, అడ్వయిజర్ మైనింగ్ డి.ఎన్. ప్రసాద్, అడ్వయిజర్ ఫారెస్ట్రీ.సురేంద్ర పాండే, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం. సురేష్, జనరల్ మేనేజర్ (పి అండ్ పి) సి.హెచ్. నర్సింహ రావు, జనరల్ మేనేజర్ మర్కెటింగ్ కె. సూర్యనారాయణ, కొత్తగూడెం ఏరియా జి. ఎం..జక్కం రమేష్, మరియు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version