సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి 

17వ రోజుకు చేరుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్షలు
జనగామ, నేటిధాత్రి:-
విద్యాశాఖలో ఏళ్ల తరబడి శ్రమ దోపిడీకి గురవుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని 
సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు ‌.
మంగళవారం జనగామ చౌరస్తాలో గత 17 రోజుల నుండి నిర్వహిస్తున్న నిరసన దీక్షలలో వారు పాల్గొని మాట్లాడారు. 17 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా 
ప్రభుత్వ పాలకులు క్రమబద్ధీకరించకపోవడం విడ్డూరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. తక్షణమే కనీస వేతన స్కేలు అమలుపరచాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న అన్ని సౌకర్యాలను సమగ్ర శిక్ష ఉద్యోగులకు వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన్ను కరుణాకర్, తాడూరు రమేష్ కుమార్, గోలి రవీందర్ రెడ్డి,
 కొమ్మరాజుల సునీత, మామిడాల శివకృష్ణ, జ్ఞానానందం, ఎడ్ల శ్రీనివాస్, సరిత, జ్యోతి, రజిత, లవ కుమార్, శ్రీకాంత్, కొండబోయిన హేమలత, సుధా గౌని నరేష్ కుమార్ , రామచందర్ , తదితరులు పాల్గొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version