మొక్కుబడిగా సాగిన మండల సర్వసభ్య సమావేశం

అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ లు మెజారిటీ గా గైరాజారు

నెక్కొండ, నేటి ధాత్రి: బుధవారం నెక్కొండ మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షుడు జాటోత్ రమేష్ నాయక్ అధ్యక్షతన జరిగింది .ఈ సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ఎక్కువ శాతం గైరాజా కావడంతో

సమావేశం మొక్కుబడిగా సాగింది. 23 అంశాలపై సభ జరగాలని ఆయా శాఖల ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇవ్వగ ఇందులో చాలా మంది అధికారులు గైరాజరయ్యారు. ముఖ్యమైన అంశాలలో ఒకటి ఎక్సైజ్ శాఖ నుండి ఎవరు రాకపోవడంతో పలువురు ప్రజాప్రతినిధులు నిస్సహాయత వ్యక్తం చేశారు .

ప్రభుత్వం మండల కేంద్రంలో నాలుగు బ్రాండి షాపులకు అనుమతిస్తే ఆ షాప్ ల యజమానులు ఐదు షాపులు నిర్వహిస్తున్నారని అందులో ఒకటి హోల్సేల్ అంటూ బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు, బెల్ట్ ల షాపు నిర్వాహకులు మరికొంత పెంచి నియోగదారులకు అమ్ముతుంటే వినియోగదారుడు తీవ్రంగా

నష్టపోతున్నారని ఇదంతా ఎక్సైజ్ అధికారులకు తెలియకుండానే జరుగుతుందా ? ఈ విషయమై అధికారులను నిలదీయాలంటే రాకపోయా అని ప్రజాప్రతినిధులు చర్చించుకుంటూ సమావేశం దృష్టికి తెచ్చారు. మండల వ్యవసాయ అధికారి నాగరాజు సభకు తన నివేదికలో రైతు బంధు 13వేల ఎనిమిది వందల తొంబై ఆరు మంది రైతులకు అర్హత పొందారని వీరి బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు జమ అవుతున్నదని అలాగే 13 896 మంది రైతులకు బీమా ప్రభుత్వం చేసిందని ఇప్పటివరకు మండలంలో వివిధ కారణాలతొ 172 మంది రైతులు మృతిచెందగా వారి కుటుంబాలకి 8 కోట్ల ఆరు లక్షల బీమా డబ్బులు అందించమని అలాగే పిఎం కిసాన్ కింద 1123 మంది రైతులకు ఏట ఆరువేల రూపాయలు చొప్పున వస్తున్నాయని, ఈ కేవైసీ మండలంలో 82% పూర్తి చేశామని జిల్లాలోనే మండలం ముందున్నదని మిగతావారు ఈ కేవైసీ చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ రెండవ పంటకు 5000 ఎకరాలకు వేరుశనగ ,ఐదు వందల ఎకరాలకు నువ్వుల,కు సబ్సిడీ కావాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని ఆయన తెలిపారు. డిప్యూటీ తహసిల్దార్ రాజ్ కుమార్ మాట్లాడుతూ రైతులు వారి భూముల సమస్యలపై 33 రకాల ఆప్షన్స్ మీ సేవలో ప్రభుత్వం ఇచ్చిందని భూ సమస్యలకొసం మీసేవ ధార దరఖాస్తు చేసుకోవాలని, ఇంకా 6,800 సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం అనుమతించగానే అవి పరిష్కరిస్తామని, అలాగే నూతన రేషన్ కార్డులు, మార్పులు, మీసేవ లో దరఖాస్తు చేసుకోవాలని సభకు తెలిపారు. గ్రామాల్లో ప్రస్తుతం ఆధార్ ఓటర్ కార్డ్ అనుసంధాన కార్యక్రమం జరుగుతున్నదని ప్రతి ఒక్కరూ ఆధార్ నెంబర్ ఇచ్చి సహకరించాలని ఇందుకోసం గ్రామాలలో సర్పంచులు ,ఎంపీటీసీలు, కూడా ప్రజలను చైతన్యపరిచి ఆధార్ నెంబర్ ఇచ్చేలా చూడాలని ,ప్రస్తుతం 25 శాతం మాత్రమే ఆధార్ ఓటర్ అనుసంధానం అయిందని ఈనెల 15లోగా మొత్తం చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రతి అధికారి తన నివేదిక చదివి సభ పూర్తి అయ్యేంతవరకు ఉండకుండా వెళ్లిపోవడం జరిగింది . సర్వసభ్య సమావేశానికి 16 మంది అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కు సమాచారం అందించగా 12 మంది గైరాజ కావడం సభ సమావేశంపై వారికి ఏ విధమైన గౌరవం ఉందో అర్ధమవుతుంది. సమావేశంలో ఎం పీ ఓ రవి, ఎంపీటీసీ సంఘని సూరయ్య ,సర్పంచులు యమునా రంజిత్ రెడ్డి ,ఆలకుంట సురేందర్, వినోద తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version