మున్నూరు కాపు బలగం విజయవంతం..కో ఆర్డినేటర్ పుప్పాల రజనీకాంత్

ఆదివారం విష్ణుప్రియ గార్డెన్స్ లో హనుమకొండ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన మున్నూరు కాపు బలగం ఆత్మీయ సమ్మేళనం విజయవంతం అయ్యింది. మహిళలు, పిల్లలు, పెద్దలు సుమారు 4 వేలకు పైగా ఈ యొక్క సమ్మేళనానికి హాజరు అయ్యారు.ప్లే బ్యాక్ సింగర్, స్వరాభిషేకం ఫేమ్ మాళవిక, ZEE సరిగమప ఫేమ్,సింగర్ సాయి శ్రీ చరణ్ తమ ఆట పాటలతో మున్నూరు కాపు కులబంధువులకు వినోదాన్ని పంచారు.20 శాతం ఉన్న మున్నూరు కాపులకు రాజకీయ పార్టీలు వాళ్ల కమిటీల్లో ముఖ్యమైన పదవులు ఇవ్వాలని,టికెట్ల విషయంలో కూడా 20 శాతం మున్నూరు కాపులకు కేటాయించాలని కోరారు.హనుమకొండ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో త్వరలో వెబ్ సైట్ లాంచ్ చేస్తున్నట్లు పుప్పాల రజనీకాంత్ తెలిపారు.ఈ యొక్క వెబ్ సైట్ మున్నూరు కాపు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఉపయోగపడుతుందని, విదేశాలకు వెళ్లే వారికోసం, పెళ్లిళ్ల కోసం ఈ వెబ్ సైట్ ఉపయోగ పడుతుందని పుప్పాల తెలిపారు.ఇది మున్నూరు కాపుల మీటింగ్ కాదని, ఆత్మీయ సమ్మేళనం కాబట్టి స్పాన్సర్లు,రావు పద్మ, నాయిని రాజేందర్ రెడ్డి,ఎర్రబెల్లి ప్రదీప్ రావు,దాస్యం అభినవ్ భాస్కర్ లను ఆహ్వానించామని, ఇందులో ఎలాంటి రాజకీయ సందేశం ఎవరూ ఇవ్వలేదని, త్వరలో ఏర్పాటు చేసే మీటింగ్ కు ఎలాంటి స్పాన్సర్లను పిలవబోమని పుప్పాల తెలిపారు.

హనుమకొండ జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త దశరథం పటేల్, వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మందా శ్రీనివాస్ పటేల్ ల ఆధ్వర్యంలో జనసమీకరణ జరిగిందని,ఈ కార్యక్రమం విజవంతం కావడంలో కృషి చేసిన మున్నూరు కాపు సంఘం నాయకులు సాయిని రవీందర్, జినుకల లక్ష్మణ్ రావు,కొండ నాగరాజు,జినుకల దేవేందర్ రావు, పుట్ట కిషోర్, గుండ్ల శ్రీనివాస్,తోట సమ్మయ్య, లింగంపల్లి సురేందర్, కోరబోయిన సాంబయ్య, సాయి,సత్యప్రకాశ్ మొదలగు వారిని పుప్పాల అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version