మండలానికి కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

కేసముద్రం (మహబూబాద్), నేటిదాత్రి:

ఇనుగుర్తి మండలం కాంక్షను

వ్యక్తం చేస్తూ సాగిస్తున్న నిరవధిక నిరహార దీక్షలు 82 వ

రోజుకు చేరుకున్నవి.

దీక్షలో కూర్చున్న నాయకులూ మాట్లాడుతూ …గాంధేయ మార్గం లో శాంతియుతంగా అర్థాకలితో దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి పట్టదా ..పలు సందర్భాలలో ఇచ్చిన హామీలు ఏమైనవి 

సెల్ టవర్ మీద 26 గం పాటు సహస దీక్ష చేసినప్పుడు దీక్ష 

విరమింపజేయడానికి ఇచ్చిన

హామీలు, పాదయాత్ర సమయంలో చేసిన బాసలు,కందునూరి

కొమురయ్య సార్ స్మారకార్దం

పెట్టిన టోర్నమెంట్ ముగింపు

కార్యక్రమంలో చెప్పిన మాటలు

ఇవి అన్ని ఏమైనవి. ఇవి అన్ని

నీటి మూటలేనా ?

బాధ్యతగల MLA,ఎంపీ , రాష్ట్ర నాయకులూ ,మంత్రులు బాధ్యత లేకుండా నోటికి ఏది వస్తే అదే

చెప్తారా ? వాటి పర్యవసానాలు ఆలోచించరా ?ప్రభుత్వం వైపునుండి బాధ్యత

గల వ్యక్తులు MLA , ఎంపీ,రాష్ట్ర నాయకులూ ,

మంత్రులు , డిప్యూటీ ముఖ్యమంత్రి, చివరికి ముఖ్యమంత్రి కూడా ఒప్పుకుని మాట ఇచ్చారు . మరి మన మండలం ఎక్కడాగింది ?

ఇది ఒక చిదంబర రహస్యం మేనా 

ప్రభుత్వం లోని పెద్దలు ఇకనైనా ఒక నిర్ణయం తీసుకొని మండలం

ఆందోళనలకు ముగింపు పలకాలని, 

ప్రజల ఆకాంక్షలు నేరవేర్చాలని లేకుంటే ఉద్యమకారులు 90 నుండి 100 రోజుల మధ్య ఎదో ఒక బలమైన తీవ్రమైన అలజడికి చేయడానికి నిర్ణయం తీసుకున్న దరిమిలా దాని కంటే ముందే మండలం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ రోజు దీక్షలో కూర్చున్నవారు……గుజ్జునురి లక్ష్మయ్య ,గంజి శ్రీనివాస్ రెడ్డి ,కాల్సని ప్రభాకర్ రెడ్డి,కాదునూరి సతీష్ ,చిన్నాల కట్టయ్య .సంఘీభావం తెలిపిన వారు….ఉద్యమకారులు ,అఖిల పక్ష నాయకులూ ,మహిళలు అధిక సంఖ్యలో దీక్ష శిభిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version