*మాజీ ఎం.ఎల్.సీ కొండా మురళీధర్ రావు*
*కార్యకర్తల కష్టసుఖాల్లో పాల్గొంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటాం*
నేటిధాత్రి: భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని,
తన నాయకత్వాన్ని నమ్ముకున్న వారిని కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో పాల్గొంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ
ఎం.ఎల్.సీ కొండా మురళీధర్ రావు
అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మొగుళ్లపల్లి శాయంపేట మండలాలలో పలు వివాహ వేడుకలలో ముఖ్యఅతిథులుగా పాల్గొనాలని కొండా దంపతుల
అభిమానుల ఆహ్వానం మేరకు వివాహా వేడుకలకు పాల్గొనడానికి వచ్చిన కొండా మురళీధర్ రావుకు కొండా దంపతుల అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
బాణాసంచాలు కాల్ చి ఘనంగా స్వాగతం పలికారు. చిట్యాల మండలంలోని బావుసింగ్ పల్లిలో
వివాహ వేడుకల్లో పాల్గొని, శాయంపేట మండలంలోని మైలారం
గ్రామానికి చెందిన నూనె లక్ష్మీనరసయ్య దంపతుల కుమార్తె దివ్యదేవేందర్ వివాహ వేడుకలో పాల్గొన్నారు, వివాహ వేడుకతో ఏకమవుతున్న నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా
మురళీధర్ రావు మాట్లాడుతూ
భూపాలపల్లి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు.
