భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రచార రథంకు పూజ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

పరకాల నేటిధాత్రి(టౌన్)
పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి అధ్వర్యంలో పరకాల నియోజకవర్గం మొత్తం ప్రచారానికిగాను,తెలంగాణ రాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ప్రచార రథాన్ని పరకాల నియోజకవర్గంలో ఊరూరా ప్రచారానికి ప్రచార రథాన్ని సిద్దం చేసారని పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి దంపతులు నాగారం గ్రామ సర్పంచ్ కట్కూరి స్రవంతి-దేవేందర్ రెడ్డిఅన్నారు. అనంతరం ప్రచార రథం పూజ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం పెద్ద ఎత్తున కార్యకర్తలతో బైక్ ర్యాలీతో పరకాల బస్సు డిపో నుండి అంబేద్కర్ కూడలి నుండి బస్టాండ్ ఏరియా వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లో ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం పరకాల పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ,అంబేద్కర్ విగ్రహాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కౌన్సిలర్ పంచగిరి జయమ్మ, రాయపర్తి ఎంపిటిసి పర్నం శ్రీలత-మల్లారెడ్డి,డీసీసీ చేనేత సెల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసరి బిక్షపతి,మాజీ ఎంపీపీ వంటేరు రామ్మూర్తి,సీతారాంపురం మాజీ సర్పంచ్ బుర్ర రాజమౌళి ,ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మ కంటి చంద్రమౌళి కాంగ్రెస్ నేతలు అల్లం రఘు నారాయణ,మంద నాగరాజు,మైనారిటీ సెల్ నాయకులు మహమ్మద్ రంజాన్ అలీ,చందుపట్ల రాజిరెడ్డి,పుట్ట రాజు,మానురి రాజు,కోసరి రాజు,మడికొండ చంగల్, రమేష్ వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version