*అధికార ప్రతినిధిని స్టేజ్ పైకి పిలవని జిల్లా అధ్యక్షురాలు*
పొలిటికల్, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జాతీయ నాయకులు విశ్వసిస్తున్నప్పటికీ, కమలంలో జిల్లా రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య ఉన్న విభేదాలు పార్టీలో చర్చనీయా అంశంగా మారాయి. ప్రజలకు చేరువై పార్టీని అధికారంలో తేవడానికి రాష్ట్ర అధ్యక్షుడు
*అధికార ప్రతినిధిని స్టేజ్ పైకి పిలవని జిల్లా అధ్యక్షురాలు*
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర హన్మకొండ, వరంగల్ జిల్లాల సన్నాహక సమావేశం గురువారం
నిర్వహించగా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాత్ర సహా ఇంచార్జ్ తుళ్ళ వీరేందర్ గౌడ్ ముఖ్యఅతిధి పాల్గొన్నారు. నాయకులతో పాటు కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డిని హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ స్టేజ్ మీదకు పిలవకపోవడం మరోసారి విభేదాలు బయటపడ్డాయి, కొద్దీ సేపు కార్యకర్తల మధ్యలో కూర్చొని రాకేష్ రెడ్డి వెళ్లిపోవడం రాష్ట్ర అధికార ప్రతినిధి, యాత్ర సహా ఇంచార్జ్ తుళ్ళ వీరేందర్ గౌడ్ విషయం పై అరా తీయడం పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందనే చర్చ నాయకులలో కొనసాగుతుంది. పార్టీ అధిష్టానం నాయకులు మధ్యలో సమన్వయం కొరకు ఏం చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సి ఉంది.