ములుగు ప్రతినిధి:నేటిధాత్రి:
ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ డా. గుగులోతు శంకర్ నాయక్ పర్యటించారు, తాడ్వాయి మండలం లోని గిరిజనుల ఆరాధ్య దైవం అయిన మేడారం సమ్మక్క సారలమ్మ లను అధికారిక లాంచనాలతో అమ్మవార్లను సతి సమ్మేతంగా దర్శించకున్నారు.

అనంతరం వాజేడు లోని బొగత జలపాతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ములుగు జిల్లా ప్రకృతి అందాలను పరవశింప జేసీ ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచుతున్నాయని ఆయన అన్నారు. అనంతరం లక్నవరం అటవీ ప్రాంతంలోని రోప్ బ్రిడ్జ్ అందాలను తిలకించారు. లక్నవరం సరస్సు లో బోటింగ్ అద్బుతం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అయా మండలాల తహశీల్దార్ లు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
