పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన చైర్మన్ 

నర్సంపేట, నేటిధాత్రి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలలో చేస్తున్న పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్మన్ గుంటీ రజిని కిషన్ హెచ్చరించారు.నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 13 వ రోజుకు చేరుకోగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో మున్సిపల్ చైర్మన్ గుంటీ రజిని కిషన్ పనులను పరిశీలన చేశారు.

 పాటు పట్టణంలోని 24 వ వార్డులలో ఇండ్ల వద్ద ఉన్న మొక్కల పంపిణీ పరిశీలన, గతంలో ప్రతి

ఇంటికి పంపిణీ చేసిన 6 మొక్కల యొక్క స్థితిగతులను పరిశీలించారు. ఆయా వార్డులలో జరిగే అభివృద్ధి పనులను, డ్రైనేజీలలో వేరకపోయిన మట్టిని జెసిబిలతో తొలగించడం వంటి పనులను, డివైడర్లలో పెంచుతున్న మొక్కల పెరుగుదల, కలుపు తీయుట వంటి

పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గుంటి రజనీకిషన్

 మాట్లాడుతూ, పాడుబడిన, నిరుపయోగంగా ప్రమాదకరంగా ఉన్న పాత బావులు మరియు

బోరుబావులను గుర్తించి వాటిని పూడ్చాలని ప్రమాదకరంగా ఉన్న పాడుబడ్డ ఇండ్లను

తొలగిస్తూ, నీటి సమస్యలను, విద్యుత్ సమస్యలను తీర్చాలని సంబంధిత మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.మున్సిపల్ పరిధిలో ప్రజల మౌలిక వసతులు కల్పించేలా ఈ నెల 18 వరకు వివిధ

కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చైర్మన్ తెలిపారు.ఈ కార్యక్రమాలలో వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి,కమిషనర్ నాయిని. వెంకటస్వామి,కౌన్సిలర్స్ దేవోజు తిరుమల సదానందం, జుర్రు రాజు , లూనావత్ కవిత, శీలం రాంబాబు , 

రామసహయం శ్రీదేవి , మినుముల రాజు, గందే రజిత చంద్రమౌళి,రాయిడి కీర్తి దృశ్యంత్ రెడ్డి, 

నాగిశెట్టి పద్మ ప్రసాద్, గంప సునీత, రుద్ర మల్లీశ్వరి , మహ్మద్ మహబూబ్ పాషా ,వేల్పుగొండ వద్మ ,బోడ గోల్య , బాణాల ఇందిర, దార్ల రమాదేవి, మున్సిపల్ సిబ్బంది మేనేజర్ రామక్రిష్ణ,ఏ.ఇ శాంతిస్వరూప్, టిపిబీఓ నునిల్ కుమార్,ఆర్.ఐ సంపత్ కుమార్, ఎన్విరాల్మెంటల్ ఇంజనీర్ సంతోష్,

 పట్టణ ప్రగతి 24 వార్డుల ఇంచార్జ్ లు,ఆర్.పిలు తదితరులు పాల్గోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version